Don't Miss!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఎటో వెళ్లి పోయింది మనసు’లో 22 నిమిషాలు కీలకం
హైదరాబాద్: ప్రేమ కథా చిత్రాలు తీయడంలో దర్శకుడు గౌతం మీనన్ తనదైన శైలిని అనుసరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు అటు ఎంటర్ టైన్మెంట్ తో పాటు... హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి కాబట్టే ఆయన సినిమాలంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడటానికి కారణం అయింది.
గతంలో గతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'చెలి', 'ఏ మాయ చేసావె' చిత్రాలు రెగ్యులర్ ప్రేమ కథా చిత్రాలే అయినా.... విభిన్నమైన ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో పాటు, డిఫరెంట్ క్లైమాక్స్ ఉండటం వల్లనే మంచి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు తన తాజా సినిమా 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం విషయంలో కూడా గౌతం మీనన్ అదే ఫాలో అవుతున్నాడు.
నాని-సమంత జంటగా నటిస్తున్న 'ఎటో వెళ్లి పోయింది' మనసు చిత్రంలో 22 నిమిషాల పాటు క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఈ పార్ట్ ప్రేక్షకులను ఎమోషనల్ గా అరెస్టు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. మరోసారి తన మార్కుతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో గౌతం మీనన్ సఫలం అయితే ఈ చిత్రం పెద్ద హిట్టే.
ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం.