Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవి సినిమాలను చూసి పెరిగానంటున్న యంగ్ హీరో
"నేను చిరంజీవి సినిమాలను చూసి పెరిగాను. అలాగే శ్రీదేవి అన్నా ఇష్టం. 'గీతాంజలి' సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. చూసిన ప్రతిసారీ మనస్సుకు హత్తుకుంటుంది" అని అన్నారు శర్వానంద్. ఆయన చిత్రం ప్రస్దానం రీసెంట్ గా ఇండియన్ పనోరమకు ఎంపికైన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే తన సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చినా ప్రేక్షకాదరణ నోచుకోపోవటానికి కారణం విశ్లేషించారు.
ఆయన మాటల్లోనే..ఇక్కడ ప్రేక్షకులను తప్పుబట్టలేం. సినిమా బాగుందా? లేదా? అనే విషయానికే వారు ప్రాధాన్యమిస్తారు. మంచి సినిమాను తప్పకుండా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఆ విషయం ఎన్నోసార్లు రుజువు చేశారు. సినిమా వారికి నచ్చలేదంటే మన దగ్గరే ఏదో లోపం జరిగి ఉండాలి. 'ప్రస్థానం', 'అందరి బంధువయ' లాంటి చిత్రాల్ని ప్రేక్షకులకు మరింత చేరువగా తీసుకెళ్లలేకపోయాం. చూసినవాళ్లందరూ బాగున్నాయన్నారు. కానీ సంతృప్తి కలగలేదు అన్నారు.
అలాగే నాకు సినిమాలంటే పిచ్చి. అందుకే నిజాయతీగా ఈ రంగంలోనే కృషి చేస్తున్నాను. కథానుగుణంగా నటించడమంటే నాకు నచ్చుతుంది. కథ డిమాండ్ చేస్తే తప్పకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించాలని ఉంది అన్నారు.