Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
రెండు లక్షలు పలికిన 'యంగ్ ఇండియా' సిడీ
దాసరి నారాయణ రావు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'యంగ్ ఇండియా' ఆడియో సిడిని ఆయన వేలం వేయగా సుధీష్ రాంభొట్ల ఆ సిడిని రెండు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ రెండు లక్షల రూపాయలకు మరో రెండు లక్షలు కలిపి ఫిలిం ఫెడరేషన్ సభ్యుల పిల్లల చదువులకు ఉపయోగపడే విధంగా వినియోగించనున్నట్టు దాసరి ప్రకటించారు. 'యంగ్ ఇండియా' ఆడియో సిడిలను సౌభాగ్య మ్యూజిక్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు దాసరి మాట్లాడుతూ...దర్శకుడిగా ఆరేళ్ళ విరామానంతరం ఏ తరహా చిత్రం రూపొందించాలా అని ఎంతో ఆలోచించి కొత్తవారితో, మంచి సందేశంతో సినిమాని రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఇతర భాషల నటీనటులను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండకూడదని భావించే నేను ఈ సినిమా ద్వారా 81 మంది విద్యాధికులైన అచ్చతెలుగు బిడ్డల్ని నటీనటులుగా పరిచయం చేస్తున్నాను. యువతరం జీవితంలో తాము అనుకున్నది ఎలా సాధించాలో చెప్పే చిత్రం మా 'యంగ్ ఇండియా. అలాగే ఈ చిత్రం ఆడియో సిడిలను శ్రోతలకు 9 రూపాయల 90 పైసలకు అందించాలని నిర్ణయించాం అన్నారు.