twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు లక్షలు పలికిన 'యంగ్ ఇండియా' సిడీ

    By Srikanya
    |

    దాసరి నారాయణ రావు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'యంగ్ ఇండియా' ఆడియో సిడిని ఆయన వేలం వేయగా సుధీష్ రాంభొట్ల ఆ సిడిని రెండు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ రెండు లక్షల రూపాయలకు మరో రెండు లక్షలు కలిపి ఫిలిం ఫెడరేషన్ సభ్యుల పిల్లల చదువులకు ఉపయోగపడే విధంగా వినియోగించనున్నట్టు దాసరి ప్రకటించారు. 'యంగ్ ఇండియా' ఆడియో సిడిలను సౌభాగ్య మ్యూజిక్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

    ఈ సందర్భంగా దర్శకుడు దాసరి మాట్లాడుతూ...దర్శకుడిగా ఆరేళ్ళ విరామానంతరం ఏ తరహా చిత్రం రూపొందించాలా అని ఎంతో ఆలోచించి కొత్తవారితో, మంచి సందేశంతో సినిమాని రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఇతర భాషల నటీనటులను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండకూడదని భావించే నేను ఈ సినిమా ద్వారా 81 మంది విద్యాధికులైన అచ్చతెలుగు బిడ్డల్ని నటీనటులుగా పరిచయం చేస్తున్నాను. యువతరం జీవితంలో తాము అనుకున్నది ఎలా సాధించాలో చెప్పే చిత్రం మా 'యంగ్ ఇండియా. అలాగే ఈ చిత్రం ఆడియో సిడిలను శ్రోతలకు 9 రూపాయల 90 పైసలకు అందించాలని నిర్ణయించాం అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X