Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పైడిపల్లి వంశీ డైరక్షన్లో ఎన్టీఆర్
'మున్నా' చిత్ర దర్శకుడు పైడిపల్లి వంశీ డైరక్షన్లో రూపుదిద్దుకోనున్న 'యంగ్టైగర్ ఎన్టీఆర్' సినిమా అన్నపూర్ణ స్టూడియోలో శనివారం ఆరంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ సారథ్యంలో "యంగ్టైగర్ ఎన్టీఆర్" కొత్త చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది.
ఎన్టీఆర్పై తీసిన ముహూర్తపు షాట్కు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. "మగధీర" దర్శకుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ..తమ బ్యానర్పై వస్తోన్న 11వ సినిమా ఇదన్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్కు సంబంధించిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని అన్నారు. ఇప్పటికే తాను నిర్మించిన చిత్రాలు కుటుంబసమేతంగా చూసి ఆనందించేవిగా ఉన్నాయని, ప్రస్తుతం ఎన్టీఆర్తో తీసే కొత్త చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో ఉంటుందని చెప్పారు.
అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షూటింగ్లో భాగంగా హైదరాబాద్, పొల్లాచ్చి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందని నిర్మాత తెలియజేశారు. షూటింగ్తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎన్టీఆర్ కొత్త చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దిల్రాజు చెప్పారు.
ఇకపోతే..రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. హీరోయిన్, మిగిలిన తారాగణం వివరాలను త్వరలో తెలియజేస్తామని వంశీ చెప్పారు.