twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబు అలా.. జగన్ ఇలా.. కేసీఆర్ సైలెంట్.. కారణం ప్రభాస్!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయం తీసుకోగా.. అచ్చం అలాంటి నిర్ణయమే తీసుకున్నారు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరి సంగతి ఇలా ఉంటే ఇదే విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇంతకీ ఏంటి సంగతి? ప్రభాస్ సినిమాలపై ముఖ్యమంత్రుల ప్రస్తావన ఎందుకొస్తోంది? వివరాల్లోకిపోతే..

    భారీ బడ్జెట్ సినిమా అంటేనే..

    భారీ బడ్జెట్ సినిమా అంటేనే..

    భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు విడుదలైన తొలి వారంలో థియేటర్స్ కళకళలాడుతుంటాయి. కాబట్టి అదే సమయాన్ని క్యాచ్ చేసుకొని సొమ్ము చేసుకోవాలని భావిస్తుంటారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే పెద్ద సినిమా విడుదలయ్యాక కొన్ని రోజుల పాటు సినిమా టికెట్ ధరలు పెంచేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ విషయంలోనే జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    సాహో ప్రభాస్.. ముఖ్యమంత్రి జగన్ అనుమతి

    సాహో ప్రభాస్.. ముఖ్యమంత్రి జగన్ అనుమతి

    ప్రభాస్ తాజా సినిమా సాహో ఈ నెల (ఆగస్టు) 30 వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందించారు మేకర్స్. అందుకే సాహో విడుదలయ్యాక మొదటి రెండు వారాల పాటు ధియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అనుమతి కోరారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

    అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్

    అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్

    జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 'సాహో' విడుదల కానున్న థియేటర్స్‌లో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. ఈ మేరకు 100 రూపాయల టికెట్ కాస్త 200 రూపాయలకు పెరగనుందని సమాచారం. గతంలో ఇదే ప్రభాస్ సినిమా 'బాహుబలి' విషయంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. కాకపోతే అప్పుడు చంద్రబాబునాయుడు సీఎం.. ఇప్పుడు జగన్ సీఎం అదే తేడా.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    తొలి రెండు వారాలు టికెట్ ధరలు పెంచుకుంటామని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని సైతం విజ్ఞప్తి చేశారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. కానీ కేసీఆర్ ప్రభుత్వం దీనిపై ఇంకా ఇల్లాంటి స్పందన ఇవ్వలేదు. అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వం కూడా సాహో విషయంలో ఓ నిర్ణయానికి రానుందని తెలుస్తోంది.

    సాహో మూవీ

    సాహో మూవీ

    యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.

    English summary
    After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully completed. In this movie promotions Prabhas intresting comments on jagan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X