twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి స్పెషల్: మెగాసూపర్ సర్‌ప్రైజ్.. బంపర్ ఆఫర్ ఇచ్చేసిన వైఎస్ జగన్

    |

    సంక్రాంతి సందర్బంగా సినీ వర్గాలను ఖుషీ చేసేలా బంపర్ ఆఫర్ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రోజంతా థియేటర్లలో సంక్రాంతి సందడి కనిపించేలా పర్మిషన్స్ ఇచ్చేశారు. ''సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో'' సినిమాలకు స్పెషల్ షోస్ వేసుకునేలా అనుమతి ఇస్తూ పండగ స్పెషల్ ట్రీట్ ఇచ్చేశారు ఈ యువ ముఖ్యమంత్రి. వివరాల్లోకి పోతే..

    భారీ డిమాండ్.. పోటా పోటీ

    భారీ డిమాండ్.. పోటా పోటీ

    ఎప్పటిలాగే సంక్రాంతికి సందడి చేసేందుకు పెద్ద సినిమాలు రెడీ అయ్యాయి. కాకపోతే ఈ సంక్రాంతి మాత్రం కాస్త స్పెషల్‌గా అనిపిస్తోంది. ఎందుకంటే యంగ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు పోటా పోటీగా తమ సినిమాలతో బరిలోకి దిగుతున్నారు కాబట్టి. వారిరువురి సినిమాలు ''సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో'' భారీ డిమాండ్‌తో రిలీజ్ కాబోతున్నాయి.

    వైఎస్ జగన్ బంపర్ ఆఫర్.. ఇదీ సంగతి

    వైఎస్ జగన్ బంపర్ ఆఫర్.. ఇదీ సంగతి

    ఈ నేపథ్యంలో ఈ ఇద్దరినీ అక్కున చేర్చుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు ఆరు షోలు వేసుకోడానికి అనుమతి ఇచ్చి మహేష్ అభిమానులను ఖుషీ చేసిన ఏపీ ప్రభుత్వం, తాజాగా 'అల.. వైకుంఠపురములో' సినిమాకు కూడా ఆరు షోలు వేసుకునేలా అనుమతిచ్చి ఆయన అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.

    రోజుకు ఆరు షోస్.. అనుమతిచ్చిన టైమింగ్స్

    రోజుకు ఆరు షోస్.. అనుమతిచ్చిన టైమింగ్స్

    సంక్రాంతి పండగ ముగిసేదాకా రోజుకు ఆరు షోస్ వేసుకునేలా అనుమతి ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. ఆ షోస్ అర్ధరాత్రి 1 నుంచి 10 గంటల మధ్యలో ప్రదర్శించుకోవచ్చు అంటూ థియేటర్లకు స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చేసింది. దీంతో ఇక ఏపీలో సంక్రాంతి పండగ రోజులన్నీ మెగాసూపర్ హంగామాతో కళకళలాడనున్నాయని చెప్పుకోవచ్చు.

    స్టార్ హీరోల బిగ్ ఫైట్

    స్టార్ హీరోల బిగ్ ఫైట్

    దాదాపు 1000 స్క్రీన్స్‌లో భారీ ఎత్తున 'అల వైకుంఠపురములో' సినిమా విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై కూడా ఓ రేంజ్ అంచనాలున్నాయి. సో ఈ సంక్రాంతికి స్టార్ హీరోల బిగ్ ఫైట్ చుడనున్నామన్నమాట.

    ఓ రేంజ్ బిజినెస్.. బయ్యర్ల సంబరం

    ఓ రేంజ్ బిజినెస్.. బయ్యర్ల సంబరం

    ''సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో'' రెండు సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలకు ప్రభుత్వ సహకారం కూడా అందడంతో ఇక కలెక్షన్ల సునామీ ఖాయం అని బయ్యర్లు ఆనందపడుతున్నారు.

    English summary
    Sarileru Neekevvaru, Ala Vaikunthapurramloo movies are ready to fight on theatars for this sankranti. Now Ap Cm Y. S. Jaganmohan Reddy gave special permission for this movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X