twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ లవర్స్ కి వైయస్ మళ్ళి ట్విస్ట్!

    By Staff
    |

    YS Rajasekhar Reddy
    రోజంతా పనిచేసినవారు ఆహ్లాదం పొందేందుకు సినిమాకంటే మరో మంచి ఉపకరణం ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆదివారం సాయింత్రం జరిగిన చెపుతూనే మరో ట్విస్ట్ ఇచ్చారు. సినిమా థియేటర్లలో ఎగువ తరగతి టికెట్టు ధరలను రూ.50కి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.35, రూ.40 టికెట్ల ధరలు పెరుగుతాయి. పరిశ్రమకు చేయూత ఇచ్చే క్రమంలో భాగంగా సినీ పరిశ్రమ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైఎస్‌ తెలిపారు. అయితే పేదలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రూ.10 టికెట్టు ధరను పెంచడంలేదని చెప్పారు. ధనిక వర్గాలవారిపైనే భారం ఉండేలా చూశామన్నారు.

    ఇక సినీరంగ ఆరాధ్యులైన బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డిల పేరిట జాతీయ అవార్డులు ప్రవేశపెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన నంది అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సినీ పరిశ్రమకు అన్నివేళలా, అన్నిరకాల తోడ్పాటును అందిస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. పరిశ్రమ మద్రాస్‌ నుంచి రాష్ట్రానికి రావడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలే చాలా కృషి చేశాయన్నారు. తాజాగా విశాఖపట్నంలో కూడా చిత్ర పరిశ్రమ వేళ్లూనుకుంటుందని తెలిపారు. సినీ పరిశ్రమ బలపడేందుకు ప్రతి అంశంలోనూ తోడ్పాటును అందిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత మేలు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్లాబ్‌ విధానం తొలగించి సినీ పరిశ్రమ నిలదొక్కుకునేలా చేశామన్నారు. ఎన్ని చెప్పినా టిక్కెట్ రేటు మళ్ళి పెర్గుతుందనే వార్త దగ్గరే చూడ్డానికి వచ్చిన జనం ఆగిపోయారు. అది సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X