Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వైఎస్ఆర్ బయోపిక్లో సుహాసిని, పోసాని.. ఏ పాత్ర కోసమంటే..
టాలీవుడ్లో బయోపిక్స్ క్రేజ్ మొదలైంది. మహానటి ఘన విజయం తర్వాత ఎన్టీఆర్, వైఎస్ఆర్, పుల్లెల గోపిచంద్ బయోపిక్స్ రూపొందుతున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వైఎస్ఆర్గా మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు.
వైఎస్ఆర్ బయోపిక్కు సంబంధించిన నటీనటుల ఎంపిక వేగం పుంజుకొన్నది. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పాత్రకు అశ్రిత వేముగంటిని ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ధృవీకరణ జరుగలేదు. ఇక వైఎస్ఆర్ జీవితంలో చేవెళ్ల చెల్లమ్మ సబితా ఇంద్రారెడ్డి పాత్ర కీలకమైంది.
వైఎస్ఆర్ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా చేవెళ్ల నుంచి ప్రారంభించే వారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన సబితా ఇంద్రారెడ్డి పాత్ర కోసం విలక్షణ నటి సుహాసిని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. ఇక వైఎస్ఆర్కు నమ్మినబంటు అని పేరు తెచ్చుకొన్న సూరీడు పాత్రకు పోసాని కృష్ణమురళీ ఎంపికైనట్టు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ బయోపిక్కు యాత్ర అనే టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.