Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వైఎస్ఆర్ బయోపిక్లో సుహాసిని, పోసాని.. ఏ పాత్ర కోసమంటే..
టాలీవుడ్లో బయోపిక్స్ క్రేజ్ మొదలైంది. మహానటి ఘన విజయం తర్వాత ఎన్టీఆర్, వైఎస్ఆర్, పుల్లెల గోపిచంద్ బయోపిక్స్ రూపొందుతున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వైఎస్ఆర్గా మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు.
వైఎస్ఆర్ బయోపిక్కు సంబంధించిన నటీనటుల ఎంపిక వేగం పుంజుకొన్నది. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పాత్రకు అశ్రిత వేముగంటిని ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ధృవీకరణ జరుగలేదు. ఇక వైఎస్ఆర్ జీవితంలో చేవెళ్ల చెల్లమ్మ సబితా ఇంద్రారెడ్డి పాత్ర కీలకమైంది.
వైఎస్ఆర్ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా చేవెళ్ల నుంచి ప్రారంభించే వారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన సబితా ఇంద్రారెడ్డి పాత్ర కోసం విలక్షణ నటి సుహాసిని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. ఇక వైఎస్ఆర్కు నమ్మినబంటు అని పేరు తెచ్చుకొన్న సూరీడు పాత్రకు పోసాని కృష్ణమురళీ ఎంపికైనట్టు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ బయోపిక్కు యాత్ర అనే టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.