Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రామ్ చరణ్ వల్లే కాలేదు, ‘రేయ్’కి రూ. 30 కోట్లా?
హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ హీరో హీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై వైవిఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్'. హీరోయిన్ సయామీ ఖేర్ ప్రముఖ నటి షబానా అజ్మీ మేనకోడలు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ సాయిధరమ్ తేజ్ ప్రియురాలిగా నటిస్తోంది. ఇప్పటికే వరుస స్లాపు సినిమాలు నిర్మించి నష్టాలో ఉన్న వైవిఎస్ చౌదరి ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు.
సినిమాను మాస్, క్లాస్ ఆడియన్స్, యూత్ మెచ్చే విధంగా పూర్తి కమర్షియల్గా రూపొందిస్తున్నాము అని చెబుతున్న వైవిఎస్ చౌదరి హీరో సాయి ధరమ్ తేజకు మెగా ట్యాగ్ ఉండటంతో భారీగానే ఖర్చు పెడుతున్నాడు. సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 30 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాతో ఖర్చుకు వెనకాడటం లేదు. సినిమా క్లామాక్స్ సాంగుకు ఏకంగా కోటిన్నర ఖర్చు పెట్టారు. దీంతో పాటు సినిమా కథా పరంగా ఎక్కువ శాతం అమెరికా, ఇతర దేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరణ జరిపారు.
అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం వైవిఎస్ అంచనాలు ఓవర్గా ఉన్నాయి అంటున్నారు. మెగా హీరో అనే ట్యాగ్ ఉన్నప్పటికీ తొలి సినిమాకు రూ. 30 కోట్లు వస్తాయని ఆశించడం తప్పే అవుతుందని, ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో భారీగా ఖర్చు పెట్టి రిస్క్ చేసాడని అంటున్నారు.
ఇప్పటి వరకు కొత్తగా ఎంటరైన హీరోకు ఆ రేంజిలో వసూళ్లు రాలేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన తొలిసినిమా 'చిరుత' బిజినెస్ రూ. 25 కోట్లు దాటలేదనే విషయాన్ని ట్రేడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల అల్లు శిరీష్ 'గౌరవం' పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైవిఎస్ చౌదరి అంచనాలు ఏమేరకు రీచ్ అవుతాయో చూడాలి.