Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
‘నిప్పు’తో చెలగాటమాడుతున్న ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్స్..?
వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఇద్దరు ప్రముఖ దర్శకులు ఒక్కటయ్యారు. అమీ తుమీ తేల్చుకోవడానికి నడుం కట్టారు. అయితే ఒకరు డైరెక్టర్ గా, మరొక్కరు ప్రొడ్యూసర్ గా రంగంలోకి దిగుతున్నారు. హిట్ కోసం మొహం వాచిన వీరిద్దరికీ హిట్ ఇవ్వగల ఒకే ఒక్కడు రవితేజ అనుకున్నారు. అందుకే అతనితో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. వారిలో ఒకరు గుణశేఖర్, దర్శకుడుకాగా, మరో డైరెక్టర్ వైవియస్ చౌదరి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
ఈ చిత్రానికి 'నిప్పు" అనే టైటిల్ అనుకున్నట్టు ముందుగానే వార్తలు వచ్చాయి. అయితే అఫిషియల్ గా ఈ రోజు (23.05.11) అనౌన్స్ చేశారు. దీని కోసం ఒక ప్రేస్ మీట్ ని కండక్ట్ చేసి ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయబోతున్నారు. మొదట గుణశేఖర్ ఈ చిత్రానికి కత్తి అనే టైటిల్ అనుకొన్నారు. అయితే ఈ టైటిల్ ని కళ్యాణ్ రామ్ సినిమాకు పెట్టడంతో తర్వాత ఇప్పుడు కొత్తగా నిప్పు అని కన్ఫం చేశారు.