Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మెగా అప్పులు: వైవిఎస్ చౌదరి థియేటర్ సీజ్
హైదరాబాద్: దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి... చివరి సారిగా తెరకెక్కించిన చిత్రం ‘రేయ్'. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని చౌదరి ఆర్థికంగా చాలా కష్టనష్టాలకు ఓర్చి తెరక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్ర నష్టాలనే మిగల్చడంతో పరిస్థితి అతని చేదాటి పోయింది.
అప్పటికే ఆర్థికగా దెబ్బతిన్న చౌదరి.... గుడివాడలోని తన ‘బొమ్మరిల్లు' థియేటర్ ను తాకట్టు పెట్టి ఆంధ్రాబ్యాంక్ లో లోన్ తీసుకున్నారు. తాను తీసిన సినిమాలు నష్టాలే తప్ప ఒక్క పైసా లాభం తెక పోవడంతో రుణం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. ధియేటర్ మీద తీసుకున్న బకాయిలను చెల్లించకపోవటంతో ఆంధ్రా బ్యాంక్ అధికారులు గురువారం సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
వరుస ప్లాపులు వైవిఎస్ చౌదరిని ఆర్థికంగా బాగాదెబ్బతీసాయి. కె.రాఘవేంద్రరావు వద్ద శిష్యరికం చేసిన చౌదరి....నాగార్జున నిర్మించిన ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి' చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ చిత్రం తర్వాత తీసిన సీతారామరాజు, యువరాజు చిత్రాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆయనకు దర్శకుడిగా అవకాశాలు తగ్గాయి.
దీంతో తనే నిర్మాతగా మారిన చౌదరి..... దేవదాసు, సీతయ్య, లాహిరిలాహిరిలో చిత్రాలు తీసి సక్సెస్ అయ్యారు. మంచి లాభాలు గడించారు. కానీ ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా ఒక్కమగాడు, గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన నిప్పు, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన రేయ్ చిత్రాల చౌదరిని ఆర్థికంగా ముంచేసాయి.