Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Veera Simha Reddy OTT: ఆ ఓటీటీలో వీర సింహా రెడ్డి.. ఎప్పుడు రాబోతుందంటే!
ఆరు పదుల వయసులోనూ అదే ఊపుతో కనిపిస్తూ.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్యనే 'అఖండ' చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను ఖాతాలో వేసుకున్న ఆయన.. ఈ జోష్లోనే ఇప్పుడు ఆయన 'వీర సింహా రెడ్డి' అనే సినిమాను చేశారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడంతో పాటు గురువారమే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!
విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'వీర సింహా రెడ్డి' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ నందమూరి అభిమానులతో రచ్చతో మోత మోగిపోతున్నాయి. ఇక, ఈ సినిమాకు టాక్ మాత్రం మిశ్రమంగా వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు. అయినా రెస్పాన్స్ భారీగా వస్తోంది.
ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన 'వీరసింహారెడ్డి' హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా డిజిటిల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ బాలయ్య సినిమా ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకుందని టైటిల్ కార్డ్సులో క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం సదరు సంస్థ కళ్లు చెదిరే మొత్తాన్ని అందజేసినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అది నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్ అని తెలిసింది. తద్వారా ఆయన కెరీర్లో మరో రికార్డు వచ్చి చేరినట్లైంది. ఇక, ఈ చిత్రాన్ని విడుదలకు యాభై రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని కూడా తెలిసింది.
ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్లో ఎద అందాలు ఆరబోత
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రూపొందిన చిత్రమే 'వీరసింహారెడ్డి'. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతాన్ని ఇచ్చాడు.