ఓటీటీలో గోపిచంద్ యాక్షన్, ఫన్, డ్రామా.. భీమాను ఎక్కడ చూడొచ్చంటే?
టాలీవుడ్ మాచో స్టార్ గోపిచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించిన భీమా చిత్రం థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే ఈ మూవీ మార్చి 8వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్, దర్శకుడు హర్ష ఏ దర్శకత్వంలో వచ్చిన చిత్రం భారీ ఒపెనింగ్స్ సాధించింది. అయితే ఈ సినిమా ఓటీటీలో ఏ ఫ్లాట్ ఫామ్, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే..
భీమా సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్గా గోపిచంద్ మరోసారి తనదైన మార్కుతో ఆకట్టుకొన్నారు. అధ్యాత్మిక కేంద్రంలో జరిగే ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్లో కథ సాగుతుంది. సెకండాఫ్లో కథను నడిపిన విధానం మంచి అనుభూతిని కలిగిస్తుంది. కన్నడ దర్శకుడు హర్ష కథను ఫుల్లుగా కమర్షియల్ ఫార్మాట్లో మెప్పించేలా చేయడం పాజిటివ్గా మారింది.

సక్సెస్ తప్పనిసరిగా కావాల్సిన సమయంలో వచ్చిన భీమా సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ దాదాపు 12 కోట్ల మేర జరిగింది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా 900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్లో 16 కోట్ల మేర కలెక్షన్లను సాధించింది. ఆంధ్రప్రదేశ్, నైజాంలో ఈ సినిమా 12.5 కోట్ల వసూళ్లను సాధించింది.
అయితే ఇటీవల కాలంలో గోపిచంద్కు మంచి ఓపెనింగ్స్తోపాటు విజయం అందజేసిన చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ దక్కించుకొన్నది. ఈ సినిమా హక్కులు భారీగా అమ్ముడుపోయాయి.

ప్రస్తుతం ఓటీటీలో భీమా స్ట్రీమింగ్ అవుతున్నది. యాక్షన్, ఔట్ అండ్ ఔట్ కామెడీని ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. భీమా కేవలం డిస్నీ+ హాట్ స్టార్లోనే కాకుండా హులు అనే ఓటీటీలో కూడా రిలీజ్ కాబోతున్నది. మరిన్నీ ఓటీటీ న్యూస్ కోసం ఫిల్మ్బీట్ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications











