OTT: ఓటిటిలో నాని, నివేతా మూవీస్.. సరిపోదా, 35 సినిమాల రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలుగు సినిమా దగ్గర పలు హిట్ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వసున్నాయి. కాగా ఈ చిత్రాల్లో ఈ కొన్ని వారాల్లోనే పలు వరుస చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకొని థియేటర్స్ లోకి జనాన్ని రప్పించాయి. కాగా ఈ చిత్రాల్లో గత ఆగస్ట్ ఎండింగ్ నుంచి చూసుకున్నట్టయితే నాచురల్ స్టార్ నాని నటించిన మాస్ చిత్రం "సరిపోదా శనివారం" తో మళ్ళీ థియేటర్స్ కి జనం కొంచెం ఎక్కువ రావడం స్టార్ట్ చేశారు.
అలాగే ఈ తర్వాత వారం నుంచి వచ్చిన చిత్రాల్లో కూడా ఒక్క విజయ్ దళపతి నటించిన చిత్రం "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం" మినహా మిగతా అన్ని వారాల్లో వచ్చిన చిత్రాలు తెలుగు బిగ్ స్క్రీన్ పై హిట్ అయ్యాయి. కాగా ఈ చిత్రాలే వరుసగా "35 చిన్న కథ కాదు" అలాగే గత వారంలోనే వచ్చిన క్రేజీ హిట్ చిత్రం "మత్తు వదలరా 2" ఇలా మన తెలుగు సినెమాలు మాత్రం థియేటర్స్ లో మంచి వసూళ్లు అందుకొని అదరగొట్టాయి.

ఐతే ఈ అన్ని సినిమాల్లో ఒక్క మత్తు వదలరా 2 మినహా మిగతా సినిమాలు మాత్రం అప్పుడే ఓటిటిలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యిపోయినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా మొదటిగా నాని, వివేక్ ఆత్రేయల భారీ చిత్రం "సరిపోదా శనివారం" విడుదల అయ్యిన నాలుగు వారాల్లోనే ఓటిటిలో అలాగే హీరోజునే తన హీరోయిన్ నటించిన చిత్రం అయితే మూడు వారాల్లోనే ఓటిటిలో దర్శనం ఇవ్వనుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా నాని సరిపోదా శనివారం ఆగష్టు 29న రిలీజ్ అయితే నెల లోపే అంటే సెప్టెంబర్ 27న ఓటిటిలోకి వచ్చేస్తుంది అని స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇదే డేట్ లో నాని సినిమా థియేటర్స్ లో వచ్చిన నెక్స్ట్ వారానికి థియేటర్స్ లో వచ్చిన బ్యూటిఫుల్ తెలుగు చిత్రం "35 చిన్న కథ కాదు" వచ్చింది.

మరి ఇందులో నాని సరసన సూపర్ హిట్స్ నిన్ను కోరి, జెంటిల్మెన్ లాంటివి కొట్టిన నివేతా థామస్ నటించిన సినిమా విడుదల అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సినిమా కూడా సరిపోదా శనివారం తోనే ఓటిటిలో ఎంట్రీ ఇవ్వబోతున్నటుగా బజ్ వినిపిస్తుంది. కాగా సరిపోదా శనివారం చిత్రాన్ని వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం సెప్టెంబర్ 27న రానుంది.
కాగా నివేతా థామస్ నటించిన చిత్రం ఓటిటి హక్కులని ఆహా దక్కించుకుంది. మరి ఇందులో అదే సరిపోదా శనివారం డేట్ లో రానుందట. మరి ఈ రెండు సినిమాలపై కూడా ఇంకా అఫీషియల్ డేట్స్ రావాల్సి ఉంది. ఇక నివేత నటించిన చిత్రాన్ని దర్శకుడు నంద కిషోర్ ఈమని చదువు విషయంలో చిన్న పిల్లలతో తల్లి భాందవ్యాలు, అలాగే ఇద్దరికీ మధ్య 35 మార్కులు ఎంత కీలకంగా మారాయి అనేది మంచి ఎంటర్టైనింగ్ గా ఎమోషనల్ గా కనిపిస్తుంది. మరి ఇలాంటి సినిమా మూడు వారాల్లోనే వచ్చేస్తే ఆశ్చర్యమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











