నేరుగా OTTలోకి రాబోతున్న కీర్తి సురేష్ రివెంజ్ థ్రిల్లర్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?
ఈ ముధ్య కాలంలో అనేక సినిమాలు త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. త్వరగానే కాదు.. మరికొన్ని చిత్రాలు అయితే నేరుగా ఓటీటీలోనే విడుదల అయి హిట్లుగా నిలుస్తున్నాయి. కరోనా సమయంలో ఇది చాలా ఎక్కువగా సాగగా.. ఈ మధ్యే కాస్త తగ్గుముఖం పట్టింది. ఎక్కువ సినిమాలు నేరుగా థియేటర్లలోకి వస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఓటీటీ వేధికగా విడుదల చేసేందుకు ఇప్పటికీ ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మరో అద్భుతమైన సినిమా ఓటీటీలోనే నేరుగా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జయం రవి, కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైరెన్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. వీరే కాకుండా ఈ సినిమాలో యోగాబాబు, సముద్రఖని, కౌశిక్ మెహతాలు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఆంటోని భాగ్యరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. విపరీతమైన స్పందన వచ్చింది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్రైలర్ తోనే అందిరోనూ అంచనాలు పెంచేసిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పటి నుంచో విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ సినిమాను ఇప్పటికే విడుదల చేయలేరు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేధికగా ఈ చిత్రాన్ని జనవరి 26వ తేదీన విడుదల చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. అన్ని హంగులతో కమర్షియల్ గా రూపొందించిన ఈ సినిమాను ఓటీటీ వేధికగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలియడంతో అంతా షాకవుతున్నారు.
అయితే పెద్ద పెద్ద నటులు ఉన్న ఈ సినిమాను ఇలా సడెన్ గా అందులోనూ ఓటీటీలో ఎందుకు స్ట్రీమింగ్ చేయబోతున్నారని అంతా అనుకుంటున్నారు. కంటెంట్ మీద పూర్తిగా నమ్మకలేకపోవడం వల్లనో లేక బయట జరిగే బిజినెస్ కంటే దీని వేధికగా ఎక్కువ డబ్బులు రావడం వల్లనో ఈ సినిమా ఓటీటీ వేధికగా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఓటీటీ వేధికగా విడుదల అయితే చూడాలని చాలా మంది సినీ ప్రియులు రెడీగా ఉన్నారు.



Click it and Unblock the Notifications











