Don't Miss!
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
SSMB28 OTT: మహేశ్-త్రివిక్రమ్ కాంబో మేనియా.. ఓటీటీ రైట్స్ కు 80 కోట్లు.. ఏ సంస్థకు అంటే?
సుధీర్ఘకాలంగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడ సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమాలు హిట్టయిన, ఫట్టు అయిన సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌలి దర్శకత్వంలో అడ్వెంచర్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా మరో సినిమా చేయనున్నాడు. SSMB28గా వస్తున్న చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇదివరకే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారీ ధరకు నైజాం రైట్స్ అమ్ముడుపోయినట్లు వార్తలు రాగా తాజాగా ఓటీటీ రైట్స్ కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారట.
ఆసక్తిగా ప్రేక్షకులు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేశ్ బాబు SSMB28 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాకుండా ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, ఇటీవల ధమాకాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీలీల ఇద్దరు హీరోయిన్లు ఉండటంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
దసరా కానుకగా..
ఇటీవల ఈ సినిమా చిత్రీకరణను జనవరి 18 నుంచి పునః ప్రారంభించిన నిర్విరామంగా కొనసాగిస్తామని మేకర్స్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేస్తామని ప్రకటించారు.
కానీ ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో మొదలు పెడతామని చెప్పి షాక్ ఇచ్చారు. అంతేకాకుండా SSMB28ని అక్టోబర్ 18న కానీ, 20న కానీ విడుదల చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. అంటే విజయదశమి దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో...
మహేశ్ బాబు SSMB28 చిత్రాన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ఫీస్ట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ చిత్రానికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ నే తీసుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ చిత్రంలో సీనియర్ హీరో జగపతి బాబు నటిస్తున్నారని టాక్ వస్తోంది. అయితే ఆయన ఇందులో విలన్ గా అదరగొట్టనున్నాడని టాక్. ఇంతకుముమందు త్రివిక్రమ్ సినిమాలో జగ్గు భాయ్ విలన్ గా చేసిన విషయం తెలిసిందే.
రూ. 50 కోట్లకు నైజాం రైట్స్..
ఇదిలా ఉంటే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ముగింపు దశకు రాకముందే భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ కు తీవ్రమైన పోటీ నెలకనగా.. ఆఖరుకు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రూ. 50 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నాడని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.
అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు గింగిరాలు తిరుగుతోంది.
భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం..
అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ SSMB28 చిత్రం డిజిటల్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఈ మూవీ పాన్ ఇండియా చిత్రమని అంతా భావిస్తున్నారు.
డిజిటల్ రైట్స్ కు అన్ని కోట్లు..
మహేశ్ బాబుకు, త్రివిక్రమ్ కు ఇది తొలి పాన్ ఇండియా చిత్రం. దీంతో అంచనాలు భారీగా నెలకొనడమే కాకుండా.. అప్పట్లోనే ఈ సినిమాకు ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేసి నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ చేజిక్కుంచుకుందని టాక్ వినిపిస్తోంది. SSMB28 సినిమా ఓటీటీ రైట్స్ కు సుమారు రూ. 80 కోట్లు పలికినట్లు సమాచారం.
ఇది అన్ని భాషలకు కలిపి వెచ్చించిన డబ్బు అని తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవ నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 50 కోట్లకు అమ్ముడు పోగా.. ఇంకా బిజినెస్ బాగా జరుగుతోందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కీలక సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.