Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Unstoppable 2: ఖుషి తర్వాత రిటైర్ అవ్వాలనుకున్నా..త్రివిక్రమ్ తో ఆ గొడవ ఇంకా తెగల్లేదు, రాజకీయాలు నాతోనే: పవన్
నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రస్తుతం ఈ టాక్ షో రెండో సీజన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ లో ఎంతో మంది స్టార్స్ వచ్చి సందడి చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో అన్ స్టాపబుల్ రెండో సీజన్ ను ముగించడంతో ఈ ఎపిసోడ్ సెన్సెషన్ గా మారింది.
రెండు పార్టులుగా రానున్న ఈ ఎపిసోడ్ మొదటి పార్టును ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు టెలీకాస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ఖుషి సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుకున్నట్లు.. అలాగే త్రివిక్రమ్ తో తేలని గొడవ గురించి ఆసక్తిగా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
గ్రాండ్ గా వెల్ కమ్..
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రోజురోజుకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కనిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ చివరి ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాగా ఆయనకు చాలా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు నిర్వాహకులు.
గోవులను సంరంక్షించే గోశాల..
స్టేజీపైకి వచ్చిన పవన్ కల్యాణ్ పై మెల్లిగా ప్రశ్నల వర్షం కురిపించాడు బాలయ్య బాబు. ఒక తోటలో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటో వేశారు. దీంతో అందరూ తెగ అరిచేశారు. తర్వాత మీకు వ్యవసాయం అంటే బాగా ఇష్టమే కదా భయ్యా అని బాలకృష్ణ అడిగితే.. అవును.. బాగా ఇష్టం అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎప్పుడు ఫామ్ హౌజేనా అని బాలయ్య అడిగితే.. లేదు.. "రాజకీయాల్లో ఉండే సరికి ఎక్కువ వెళ్లలేకపోతున్నా. నాకు ఒక గోశాల ఉంది. ఒక 30కిపైగా ఆవులు ఉంటాయి. అంటే పాడి కోసం కాదు. గోవులను సంరక్షించే నా వ్యక్తిగత గోశాల" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రిటైర్ అవ్వాలనుకున్నా..
ఈ ఫార్మింగ్ ఇదంతా ఎప్పటి నుంచి మొదలైంది అని బాలకృష్ణ అడిగితే.. "ఇది ఖుషి సినిమా అయిపోయిన తర్వాత కొన్నాను. ఒక 8 ఎకరాలు ఉంటుంది. వ్యవసాయం చేసుకుందామనే ఉద్దేశంతోనే కొన్నాను అని పవన్ కల్యాణ్ చెబితే.. ఏంటీ అప్పటి నుంచే.. ఆ సమయంలో నువ్ చాలా యంగ్ కదా.. ఇదంతా ఎలా అని బాలకృష్ణ అడిగారు. అంటే నాకు ఖుషి సినిమా తర్వాత ఒక నాలుగు ఐదు సినిమాలు చేసేసి సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయిపోదామనుకున్నా" అని పవన్ కల్యాణ్ తెలిపారు.
సాటి మనిషికి సాయం చేద్దామని..
"సినిమాలు ఎక్కువ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఖుషి సినిమా తర్వాత ఐదు సినిమాలు డైరెక్ట్ చేసి.. నేను అనుకుంది ఏమంటే.. నా డెస్టినీ ఏంటో నాకు అర్థం కాలేదు. నేను యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. కానీ ఎందుకయ్యానో తెలియలేదు. అప్పుడు పాలిటిక్స్ అనుకోలేదు. ఏం అనుకోలేదు. కానీ సాటి మనిషికి సాయం చేద్దామని ఉండేది. అంతకుమించి ఏం ఉండేది కాదు. అదేంటో నాకు తెలియలేదు. ఎన్జీవో ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
కథను ఏమైనా రిపేర్ చేస్తాడేమో..
ఒకసారి తివిక్రమ్ నీ దగ్గరికి కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నువ్ ఏదో మొటార్ బిగించుకుంటూ, రిపేర్ చేసుకుంటూ ఉన్నావట కదా అని బాలకృష్ణ అంటే.. నేను ఫామ్ హౌజ్ లో పని చేసుకుంటూ ఉన్నాను. ఆయన వచ్చినట్లు కూడా తెలియదు. మధ్యలో వచ్చి వెళుతూ ఉంటే ఆయన్ను చూశాను అని పవన్ కల్యాణ్ అంటే.. ఆయన వచ్చి వెళ్లిపోయాడు అంతేనా. కథను ఏమైనా రిపేర్ చేస్తాడేమో అని బాలకృష్ణ అన్నాడు. అవును వెళ్లిపోయాడనుకుంటా అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఆ గొడవ ఇంకా తేలలేదు..
మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అని బాలకృష్ణ అంటే.. "ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది. మొదట ఆయన నాకు కథ చెప్పినప్పుడు అది అతడు కథ అని అనుకోలేదు. ఈరోజుకి మా ఇద్దరి మధ్య గొడవ ఏంటంటే.. నేను నీకు అతడు కథ చెబుతుంటే నువ్వు నిద్ర పోయావ్ అంటాడు. నేను నిద్రపోలేదు. మెళకువగానే ఉన్నానంటే వినడు. అది మా ఇద్దరి మధ్య ఇంకా తెగల్లేదు. కాల క్రమేణా మా ఇద్దరి మధ్య పుస్తక పఠనం, సైన్స్ టెక్నాలజీ, అంటే సినిమా తక్కువగా ఉంటుంది. ఈ పోయెట్రీ, పురాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నేను ఆయన్ని ఫ్రెండ్ గా కంటే.. గురువుగా భావిస్తాను" అని పవన్ కల్యాణ్ తెలిపారు.
నాకు నేనే డిస్కస్ చేసుకుంటా..
రచయితను, దర్శకుడిని గురువు స్థానంలో చూశావ్ అంటే.. ఇప్పుడు వ్యక్తిగా నాకు ఇంకా గౌరవం పెరుగుతుంది అని బాలకృష్ణ అన్నారు. పాలిటిక్స్ గురించి ఎవరితో డిస్కస్ చేసుకుంటూ ఉంటావ్ అని మెల్లిగా అడిగిన బాలయ్య బాబు తర్వాత నవ్వాడు. అప్పుడు అందరూ ప్రేక్షకులు ఈలలు వేస్తూ అరిచారు. దానికి నాతో నేను కూర్చోని డిస్కస్ చేసుకుంటూ ఉంటాను అని పవన్ కల్యామ్ సమాధానం ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరు తెగ నవ్వేశారు.