BRO: మేనల్లుడితో పవన్ పవర్ఫుల్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ బ్రో... వినోదాయ సీతమ్ రీమేక్ గా రానుంది. ఇక పవర్ఫుల్ గా రెడీ అవుతున్న ఈ మూవీకి తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు సముద్రఖని ఆవిష్కరించారు.
టైమ్ ని ఈ మూవీలో లీడ్ రోల్ గా మార్చి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తో ప్రెజెంట్ చేస్తున్నారు. ఫాంటసీ లైన్ లో సోషల్ ఇష్యూకి రిలేట్ చేసి ప్రతి ఒక్కరి జీవితంలో టైమ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తేజ్ కి జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ జోడీగా నటిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ ని మూవీ కోసం సముద్రఖని ఎంపిక చేసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

జులై 28న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన బ్రో మోషన్ పోస్టర్ ద్వారా ఈ మూవీ ఒటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో బ్రో మూవీ కోసం జీ స్టూడియోస్ కూడా టై అప్ అయ్యింది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ నుంచి చూస్తే అతని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.

ఇక తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తూ ఉండగా బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ళ భరణి, రాజా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. రంగామార్తాండ తర్వాత బ్రహ్మానందం కనిపించబోయేది ఈ మూవీలోనే కావడం విశేషం. మరి అతని పాత్ర ఫన్ జోనర్ లో నడుస్తుందా లేదంటే సీరియస్ టచ్ ఉంటుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్ లో తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ నెల ఆఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉందని టాక్. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీని నిర్మిస్తూ ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











