Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Pooja Hegde చేతుల మీదుగా మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ ట్రైలర్.. ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
ఓటీటీ రంగంలో ZEE5 సంస్థ విభిన్నమైన కంటెంట్తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాళీ, ఇతర రంగాల్లో దూసుకెళ్తున్నది. ఇటీవలే ఈ ఓటీటీ ఫ్లాట్ఫాంపై రిలీజైన RRR మూవీ రికార్డులు తిరగరాస్తున్నది. ఇటీవల ఈ వేదికపై రిలీజైన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి, లూజర్ 2, గాలివాన, రెక్కీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఈ క్రమంలోనే సుశాంత్ హీరోగా 8 ఎపిసోడ్స్తో కూడిన మరో విభిన్నమైన కంటెంట్తో మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను బుట్టబొమ్మ పూజా హెగ్డే రిలీజ్ చేసింది.
మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ ట్రైలర్లో ఓ చిన్న గ్రామంలో ఎలాంటి సమస్యలు లేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరో సుశాంత్ కనిపించారు. సురేఖ (ప్రియా ఆనంద్) అనే అమ్మాయి ప్రేమ కోసం కమెడియన్ సుదర్శన్ నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తూ కనిపించాడు. ఇలాంటి ఎమోషన్స్తో మా నీళ్ల ట్యాంక్ ట్రైలర్ ఆసక్తిని రేపింది. ఫన్, ఎమోషన్స్తో ట్రైలర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ను అందించింది.
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ZEE5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కర్లా మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి.. తెలుగు ప్రేక్షకుల కోసం విభిన్నమైన కంటెంట్ను అందించేందుకు మా సంస్థ ప్రయత్నిస్తున్నది. ప్రేక్షకుల అంచనాలను చేరుకొనేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఆ క్రమంలోనే మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వెబ్ సిరీస్ ద్వారా సుశాంత్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. Zee5 మంచి కంటెంట్ను అందించేందుకు కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను అని అన్నారు.
నటీనటులు: సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోషా, దివి వద్యా, అన్నపూర్ణమ్మ, అప్పాజీ అంబరీష, బిందు చంద్రమౌళి, సందీప్ వారణాసి, లావణ్య రెడ్డి తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ జూలై 15వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది.