OTT: ఆ ఫేమస్ ఓటీటీలోనే సుహాస్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది పైకి వచ్చిన వాళ్లు ఉన్నారు. అప్పట్లో చిరంజీవి, రవితేజ ఉంటే.. ఈ తరం వారిలో సుహాస్ ఉన్నారు. కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్నేహితుడి ఫ్రెండు పాత్రలో, విలన్ పాత్రలో నటిస్తూ... ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రైటర్ పద్మభూషన్ సినిమాతో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డీసెంట్ టాక్ లభించుకున్న ఈ సినిమా ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే....
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. ఈ సినిమా శుక్రవారం అనగా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గురువారం (ఫిబ్రవరి 1) నాడే ఈ సినిమా పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. దీంతో ఈ సినిమా చూసిన వాళ్లంతా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు సౌండ్ గట్టిగానే ఉందంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ రివ్యూ కూడా ఇచ్చేశారు. ఫస్టాఫ్ అయితే పగిలిపోయిందంటూ తన ట్విట్టర్ వేదికగా రివ్యూను రాసుకువచ్చాడు. అందరూ తప్పకుండా ఈ మూవీ చూడాల్సిన సినిమా అంటూ కితాబుఇచ్చాడు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సుహాస్ రైటర్ పద్మభూషన్ తర్వాత ఈ సినిమాతో మరో హిట్ కొట్టేలా ఉన్నాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సుహాస్ హీరోగా నటించగా... శివానీ నగరం హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాను కొత్త దర్శకుడు దుశ్యంత్ తెరకెక్కించగా.. సుహాస్ అక్క పాత్రలో శరణ్య ప్రదీప్ కనిపించింది. జగదీష్, నితిన్ ప్రసన్న, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలో నటించారు. బన్నీ వాస్, దర్శకుడు వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించగా.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

అంబాజీపేట మ్యారెజ్ బ్యాండ్ చిన్న చిత్రం అయినప్పటికీ.. మంచి బజ్ నెలకొంది. దీంతో ఈ సినిమా డిజిటల్ ప్రిమియర్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ, తెలుగు కంటెంట్ అందించే ఆహా ఈ సినిమాను భారీ ధరకు ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.లేదంటే సినిమా రిలీజ్ అయిన 40 రోజులకు ఓటీటీలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు స్ట్రీమింగ్ కానుంది.
ఇక సుహాస్ నటించిన ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా విషయానికి వస్తే... మనుషుల మధ్య అహం ఎలాంటి సమస్యలను సృష్టిస్తుందనే పాయింట్తో ఈ మూవీని దర్శకుడు దుశ్యంత్ చక్కగా తెరకెక్కించాడు. ఈ వారం టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు కాబట్టి... అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజులో కలెక్షన్లు రాబడుతుందో.


Click it and Unblock the Notifications











