టాప్ యాంకర్పై వ్యభిచారం ఆరోపణలు.. శ్రీరెడ్డి వెనుక కీలక నేత హస్తం?
వివాదాస్పద నటి, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి విడుదల చేసిన వీడియోలు అటు రాజకీయాల్లోను, ఇటు సినిమా రంగంలోను తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇటీవల వైసీపీ పార్టీలో చేరిన ఓ టాప్ యాంకర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత నిర్ణయాన్ని ధిక్కరించేలా ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక ఓ కీలక నేత మద్దతు ఉందనే విషయం రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశమవుతున్నది. ఈ వివాదం వెనుక వివరాల్లోకి వెళితే..
గత ఎన్నికల్లో పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని నటి, టాప్ యాంకర్కు పార్టీలో కీలక పదవిని ఆశించారు. అయితే ఆమెకు ఆ పదవి కట్టబెట్టినప్పటి నుంచి శ్రీరెడ్డి అసహనంతో ఊగిపోతున్నారు. అయితే తనకు దక్కని పదవి మరోకరికి దక్కడంతో వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా తీవ్రమైన ఆరోపణలు కూడా చేయడం వివాదంగా మారింది.

ఇటీవల శ్రీరెడ్డి వీడియో విడుదల చేసిన టాప్ యాంకర్పై నిప్పులు చెరిగారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా అర్హత లేని వారికి పదవులు కట్టబెడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉండి అండగా నిలిచిన మాకు ఎలాంటి గుర్తింపు లేదు. వ్యభిచారం చేసే వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారు. ఇది ఎలా న్యాయం అవుతుందని ప్రశ్నించారు.
అయితే సినిమా పరిశ్రమలో సదరు వ్యక్తి వ్యభిచారం చేస్తున్నారట. సంపన్నలకు, హై సొసైటీలో ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. రోజుకు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు.అలాంటి వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందా? అని శ్రీరెడ్డి ప్రశ్నించడం రకరకాల చర్చలకు దారి తీసింది. వైసీపీ పార్టీలో శ్రీరెడ్డి వ్యవహారంపై కూడా భారీగానే చర్చ జరిగిందనేది తాజా సమాచారం. శ్రీరెడ్డిని కట్టడి చేసేందుకు కూడా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు తెలిసింది.

ఇదిలా ఉండగా, శ్రీరెడ్డి రెచ్చిపోయి మహిళా నేత,యాంకర్పై ఆరోపణలు చేయడం వెనుక ఓ నాయకుడి మద్దతు ఉంది. ఓ కీలక నేత సపోర్టుతోనే ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నేతల దృష్టికి ఆ కీలక నేత వ్యవహారం వచ్చింది.అయితే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇలాంటి దిగజారుడు కామెంట్లు చేయడం సరికాదు. పార్టీ పరువు మరింత దిగజారే పరిస్థితి ఉందని హెచ్చరికలు కూడా జారీ చేశారనేది తాజా సమాచారం.
ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా రాణించడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో.. అవకాశాల పేరుతో తనను శారీరకంగా వాఆ తడుకొన్నారంటూ మీటూ ఉద్యమాన్ని కొనసాగించింది. ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయి వైసీపీ సానుభూతి పరురాలిగా మారిపోయారు. తాజాగా ఆమెకు గుర్తింపు దక్కకపోవడంతో సంచలన రీతీలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











