Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అర్జున్ - సమీక్ష
నటీనటులు: మహేష్బాబు, శ్రియా, కీర్తిరెడ్డి, ప్రకాష్రాజ్,
సరిత, రాజా, రాజన్ పి దేవ్, కళాభవన్ మణి, తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: ఘట్టమనేని రమేష్బాబు
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
'ఒక్కడు' వంటి బ్లాక్బస్టర్ యాక్షన్ చిత్రం రూపొందించిన దర్శకుడు గుణశేఖర్, మహేష్బాబు కాంబినేషన్లో వచ్చిన 'అర్జున్' గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, సిస్టర్ సెంటిమెంట్కు యాక్షన్ ఆయింట్మెంట్గా పూసే ప్రయత్నం. టీవీ సీరియల్ తరహా కథ కు మహేష్బాబు ఒక్కడిని పూర్తిగా నమ్ముకొని దర్శకుడు సినిమాను యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించేందుకు విశ్వప్రయత్నం చేసినా విజయం సాధించలేకపోయాడు. యావరేజ్ చిత్రం. నిజానికి మహేష్బాబు నటన, యాక్షన్ సన్నివేశాల్లో అతని అద్భుతమైన ఈజ్, టేకింగ్ గిమ్మిక్కుల మినహాయిస్తే, ఈ సినిమా 'పుట్టింటికి రా చెల్లి' టైఫ్ సెంటిమెంట్ చిత్రం.
వినోదం ఏ మాత్రం లేదు. సినిమా అంతా మహేషే. అతను ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. నోడౌట్. కానీ కథ మరీ పాతకాలం మాదిరిగా ఉన్నప్పుడు, హీరోకి ప్రత్యర్థి (విలన్) బలంగా ఉండాలి. ఇందులో విలన్లు ప్రకాష్రాజ్, సరితలు. వీరు హీరోయిన్ సిస్టర్ను తమ కోడలిని చంపేసి, తమ కొడుకును ఆస్తివంతురాలైన మరో అమ్మాయికి కట్టబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. వీరి నుంచి తన సిస్టర్ను కాపాడుకునే ప్రయత్నమే హీరో లక్ష్యం.
ఒక మాస్ హీరోకి తన చెల్లెలిని చంపాలనుకునే అత్తామామలు విలన్లు అనేది వర్కవుట్ కానీ ఐడియా. గుణశేఖర్ 'ఒక్కడు' యాంగోవర్ నుంచి బయటపడలేదు. 'ఒక్కడు' కంటే భారీగా, స్టైల్గా యాక్షన్ దృశ్యాలను తీయడంలోనే ఆయన నిమగ్నమయినట్లు కన్పించింది. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ, 'థ్రిల్లింగ్' కలిగించే విధంగా తీయలేదు.
అర్జున్(మహేష్), మీనాక్షి(కీర్తిరెడ్డి) కవలపిల్లలు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. మీనాక్షిని ఆమె క్లాస్మేట్ ఉదయ్ (రాజా) ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను వ్యక్తపరచలేకపోతాడు. ఆయన తల్లితండ్రులు వేరే అమ్మాయితో పెళ్ళి కుదిరినప్పుడు తన ప్రేమను లెటర్ ద్వారా వ్యక్తపరుస్తాడు. సో..మీనాక్షిని తీసుకొని అర్జున్ మధురై వెళుతాడు. వీరిద్దరికీ గుడిలో పెళ్ళిచేస్తాడు. ఉదయ్ తల్లితండ్రులు (ప్రకాష్రాజ్, సరిత) మీనాక్షిని చంపి, తాము ఒరిజనల్గా చూసిన అమ్మాయితో తిరిగి పెళ్ళిచేయించాలని ప్రయత్నిస్తారు. తన సిస్టర్ను వీరి నుంచి హీరో ఎలా కాపాడుకుంటాడనేది కథ.
మధుర మీనాక్షి టెంపుల్ భారీ సెట్ రిచ్గా కన్పించింది. అయితే, ఇది కేవలం సెట్ ఫర్ సెట్లాగే ఉంది తప్ప కథ ప్రకారం మధురై అయినా ఒకటే, చార్మినార్ అయినా ఒకటే. దానివల్ల కథ స్వరూపం పెద్దగా మారదు. కేవలం డిఫరె ంట్ బ్యాక్గ్రౌండ్ కోసం చేసిన ప్రయత్నం. కీర్తిరెడ్డి, మహేష్ల మధ్య సెంటిమెంట్ సీన్లే ఎక్కువ. కీర్తిరెడ్డి బాగా చేసింది. ఇక హీరో మహేష్ సినిమా అంతా తానే అయి విజృంభించాడు. శ్రియా, మహేష్ల మధ్య సరైన 'కెమిస్ట్రీ' లేదు. ఆ మాటకొస్తే శ్రియా మరీ సన్నబడి సెక్స్ అప్పీల్ లేకుండా మారింది. తెలుగువారికి కాస్తా ఒళ్ళు ఉంటేనే నచ్చుతుంది కదా!
మణిశర్మ స్వరపర్చిన సంగీతంలో మూడు పాటలు బాగున్నాయి. శేఖర్ జోసెఫ్ ఫోటోగ్రఫీ, పద్మశ్రీ తోట తరణి అద్భుతమైన కళాదర్శకత్వం సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాలు. స్థూలంగా చెప్పాలంటే, గుణశేఖర్ ట్రీట్మెంట్ బాగున్నా, సినిమాను 'థ్రిల్లింగ్'గా, కాస్తా వినోదాత్మకంగా తీస్తే భారీ హిట్ అయ్యేది. ఓవరాల్గా యావరేజ్ చిత్రంగానే అన్పించింది.