Don't Miss!
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
అద్భుతం.. ఆమోఘం.. డార్క్ మూవీపై మహేష్బాబు రివ్యూ: 10/10 రేటింగ్ అంటూ..
కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా సూపర్స్టార్ మహేష్ బాబు గత 100 రోజులకుపైగా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబానికి పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయిస్తూ పిల్లలతో ఎంజాయ్ చేసిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఫిట్నెస్పై దృష్టిపెడుతూ.. అలాగే ఓటీటీలో సినిమాలు చూస్తూ టైమ్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారనే విషయం సోషల్ మీడియా ద్వారా స్పష్టమైంది. తాజాగా తాను చూసిన ఓ వెబ్ సిరీస్ గురించి తన అభిప్రాయాలను పంచుకొంటూ...
డార్క్ వెబ్ సిరీస్ చూశా
సూపర్స్టార్ మహేష్బాబు తాను చూసిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఇటీవల నేను డార్క్ అనే వెబ్ సిరీస్ చూశాను. నాకు చాలా నచ్చింది. మీరు కూడా చూడండి. డార్క్ వెబ్ సిరీస్ను జర్మన్ వెర్షన్లోనే ఇంగ్లీష్ టైటిల్స్తో చూడండి అని తెలిపారు. డార్క్ చిత్రాన్ని భార్య నమత్రా శిరోద్కర్తో కలిసి చూసినట్టు స్పష్టమైంది.
ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా
డార్క్ వెబ్ సిరీస్ గురించి తెలియజేస్తూ తన సోషల్ మీడియాలో డార్క్ సినిమా పోస్టర్ను మహేష్ బాబు షేర్ చేశారు. డార్క్ సినిమా తీసిన విధానం అమోఘం. కథ, కథనాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా అని నా ఉద్దేశం. అందుకే ఈ సినిమా గురించి తెలియజేయాలనుకొన్నాను అని మహేష్ బాబు చెప్పారు.
మైండ్ బ్లాంక్ అయ్యేలా
డార్క్ సినిమాపై నమత్ర శిరోద్కర్ కూడా ప్రశంసల వర్షం కురిపించింది. మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. సినిమా చూస్తే ఇదెలా సాధ్యం అనే ఫీలింగ్ కలుగుతుంది. మీకు అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది. ఈ వెబ్ సిరీస్కు రేటింగ్ ఇవ్వాలంటే నేను 10/10 పాయింట్స్తో రేటింగ్ ఇస్తాను అని నమ్రత తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది.
డార్క్ సినిమా కథేంటీ అంటే
డార్క్ వెబ్ సిరీస్ విండెన్ అనే పట్టణం నేపథ్యంగా కథ సాగుతుంది. అదృశ్యమైన పాప కోసం వెతికే క్రమంలో నాలుగు కుటుంబాలకు ఎదురుదైన అనుభవాల కథే డార్క్. ఆ నాలుగు కుటుంబాలు ఎదుర్కొన్న మిస్టరీ సంఘటనలు, అతీత శక్తుల ఏమిటనవే ఈ వెబ్ సిరీస్ కథ. అయితే అద్భుతమైన గ్రాఫిక్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఈ వెబ్ సిరీస్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయనేది ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్.
సర్కారు వారి పాట మూవీతో
ఇక మహేష్ కెరీర్ విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత ప్రస్తుతం సర్కారు వారీ పాట సినిమాను చేయాలనుకొంటున్నారు. ఈ చిత్రానికి గీత గోవిందం దర్శకుడు పరుశురాం డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సెట్స్పైకి వెళ్లాల్సిన చిత్రం కరోనావైరస్ కారణంగా ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లే ప్రయత్నాలను చేస్తున్నారు.