Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హిట్ ఫార్ములా నరసింహనాయుడు
ఇదిలా ఉంటే గ్రామం కోసం మొరటు మషిగా తయారైన నరసింహనాయుడుకు ఎవరూ పిల్లను ఇవ్వక పోవటంతో అబద్దమాడి సిమ్రాన్తో పెళ్ళి జరిపిస్తాడు రఘుపతినాయుడు. అప్పలనాయుడుని చంపిన నరసింహనాయుడు పై పగతో అతని బావ కుప్పుస్వామి నాయుడు రఘుపతినాయుడు కుటుంబాన్ని కడతేర్చటానికి కంకణం కట్టుకుంటాడు. అన్నలను అవమానించిందని భావించిన సిమ్రాన్ ను ఇంటినుంచి వెళ్ళగొడతాడు నరసింహనాయుడు. అప్పటికే ఆమె గర్భవతి. నరసింహనాయుడు కుమారుడిని చంపాలనుకున్న కుప్పుస్వామి నాయుడు బారి నుంచి బిడ్డను రక్షించి సిమ్రాన్ ప్రాణాలు విడుస్తుంది. అయితే భార్య చివరి కోరిక మేరకు బాలయ్య ఆ ఊరు విడిచి పెట్టి డాన్సు టీచర్ గా శాంతియుత జీవితం గడుపుతుంటాడు. ఇదంతా ఫ్ల్యాష్ బ్యాక్లో వస్తుందనుకోండి. ఇక్కడితో ఆగిపోతే సినిమా ఏం బాగుంటుంది?
అందుకే అతనికి ప్రీతి జింగ్యానీతో పరిచయం అవుతుంది. ఈ ప్రీతి కుప్పుస్వామి నాయుడు కూతురు. కొన్ని లవ్ సాంగ్స్,రొమాంటిక్ సన్నివేశాల అనంతరం డాన్స్ టీచరే నరసింహనాయుడు అని తేలటంతో దాడికి వస్తాడు కుప్పుస్వామి నాయుడు. తిప్పి కొట్టిన నరసింహనాయుడు ప్రీతిని తీసుకు వెళ్ళటానికి కళ్యాణ మంటపానికి వస్తానని సవాల్ చేస్తాడు. అలాగే వెళ్ళి విలన్ భరతం పట్టడంతో, హీరోకు సారీ చెప్పుకున్న కుప్పుస్వామి నాయుడు తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేయడంతో సినిమా సుఖాంతమవుతుంది. సినిమాలో రౌద్ర రసం, ప్రణయ రసం సమపాళ్లలో ఉండడం వల్ల ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ కాడు. పాటలు బాగున్నాయి. వాటిని చిత్రీకరించిన లొకేషన్లు అద్బుతంగా ఉన్నాయి.
ప్రత్యేకించి కథ కన్నా కథనం చాలా బాగుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా మోతాదుకు తగ్గట్టే ఉండటంతో సినిమా రక్తి కట్టింది. చిన్ని కిష్ణ స్ర్కీన్ప్లే, పరుచూరి సోదరుల సంభాషణలు ఈ సినిమాకు ఆయువు పట్టుగా పేర్కొన వచ్చు. వి.యస్.ఆర్.స్వామి కెమెరా పనితనం, నటీనటుల నటన అన్ని సమస్థాయిలో ఉన్నాయి. విరామంకు ముందు వచ్చే ట్రయిన్ ఛేజ్ సినిమాకు హైలైట్. అయితే సినిమాలోని కేరక్టర్ల పేర్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. రాయలసీమలో చిత్తూరు జిల్లాలో తప్ప నాయుడులు మరెక్కడా ఉండరు. చిత్తూరు జిల్లాలో ఫ్యాక్షన్లు లేవు. అయితే ఈ చిన్న అపశృతి గురించి సామాన్యులకు అనవసరం గనుక సినిమా దివ్యంగా ఆడుతుంది. 2001 సంవత్సరంలో హిట్కు బోణీ కొట్టడమే కాకుండా తెలుగుసినీ పరిశ్రమకు మంచి రోజులు తీసుకొచ్చిన చిత్రంగా ఈ సినిమాను అభివర్ణించవచ్చు.