Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మనసుకు హత్తుకునేచిత్రం
శివాజీ సతమ్, రీమాల ఏకైక కుమార్తె నిషా. కాలేజీలో చదువుతుంటుంది. ఆమె స్నేహితుడు సునీల్. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. పరీక్షల సమయంలో నిషాకు జ్వరం వస్తుంది. ఎంతకీ తగ్గకపోవడంతో రక్తపరీక్ష చేస్తారు. అందులో నిషాకు హెచ్.ఐ.వి పాజిటివ్ ఉందని తెలుస్తుంది. చిన్నతనంలో అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగినప్పుడు రక్తాన్ని పరీక్షించకుండా ఎక్కించినందువల్లే ఈ దారుణం జరిగిందని డాక్టర్ చెపుతాడు. పెళ్ళికెదిగిన కూతురు ఎయిడ్స్ బారిన పడి చావును తప్పించుకోలేని పరిస్థితిని ఆ తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతారు. నిషా వ్యాధి గురించి సునీల్ కు చెప్పి తన కూతురును కలుసుకునే ప్రయత్నం చేయవద్దని శివాజీ చెపుతాడు.
అయితే, నిజమైన ప్రేమకు నిర్వచనం చెపుతూ సునీల్ నిషాను పెళ్లిచేసుకంటాడు. చిన్నపట్నుంచీ నిషా సంజయ్ దత్ అభిమాని. సంజయ్ దత్ నిషా ఉన్న ఆసుపత్రికి వచ్చి కలుసుకున్న తర్వాత... ఆమెను ఇంటికి తీసుకొస్తారు. కొద్దిరోజులకే ఆమె శాశ్వతంగా కన్నుమూస్తుంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తీసిన చిత్రం ఇది. అందుకే ఈ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం వినోదపు పన్నును రద్దుచేసింది. ఓ చక్కని కథను అల్లి మనసును కదిలించే విధంగా ఎయిడ్స్ వ్యాధి గురించి మహేష్ మంజ్రేకర్ చెప్పిన తీరు ప్రశంసనీయం. రాహూల్ రణడే సంగీతమూ ఈ చిత్రం మూడ్ కనుగుణంగా ఉంది. శివాజీ సతమ్, రీమాలాగూ వంటి సీనియర్ల నటనతో పాటు ఎయిడ్స్ పేషంట్ గా నిషాబైన్స్ నటనా ముగ్ధుల్ని చేస్తుంది. సునీల్ బార్వే నటన కూడా చాలా బావుంది.