Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మనసుకు హత్తుకునేచిత్రం
శివాజీ సతమ్, రీమాల ఏకైక కుమార్తె నిషా. కాలేజీలో చదువుతుంటుంది. ఆమె స్నేహితుడు సునీల్. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. పరీక్షల సమయంలో నిషాకు జ్వరం వస్తుంది. ఎంతకీ తగ్గకపోవడంతో రక్తపరీక్ష చేస్తారు. అందులో నిషాకు హెచ్.ఐ.వి పాజిటివ్ ఉందని తెలుస్తుంది. చిన్నతనంలో అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగినప్పుడు రక్తాన్ని పరీక్షించకుండా ఎక్కించినందువల్లే ఈ దారుణం జరిగిందని డాక్టర్ చెపుతాడు. పెళ్ళికెదిగిన కూతురు ఎయిడ్స్ బారిన పడి చావును తప్పించుకోలేని పరిస్థితిని ఆ తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతారు. నిషా వ్యాధి గురించి సునీల్ కు చెప్పి తన కూతురును కలుసుకునే ప్రయత్నం చేయవద్దని శివాజీ చెపుతాడు.
అయితే, నిజమైన ప్రేమకు నిర్వచనం చెపుతూ సునీల్ నిషాను పెళ్లిచేసుకంటాడు. చిన్నపట్నుంచీ నిషా సంజయ్ దత్ అభిమాని. సంజయ్ దత్ నిషా ఉన్న ఆసుపత్రికి వచ్చి కలుసుకున్న తర్వాత... ఆమెను ఇంటికి తీసుకొస్తారు. కొద్దిరోజులకే ఆమె శాశ్వతంగా కన్నుమూస్తుంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తీసిన చిత్రం ఇది. అందుకే ఈ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం వినోదపు పన్నును రద్దుచేసింది. ఓ చక్కని కథను అల్లి మనసును కదిలించే విధంగా ఎయిడ్స్ వ్యాధి గురించి మహేష్ మంజ్రేకర్ చెప్పిన తీరు ప్రశంసనీయం. రాహూల్ రణడే సంగీతమూ ఈ చిత్రం మూడ్ కనుగుణంగా ఉంది. శివాజీ సతమ్, రీమాలాగూ వంటి సీనియర్ల నటనతో పాటు ఎయిడ్స్ పేషంట్ గా నిషాబైన్స్ నటనా ముగ్ధుల్ని చేస్తుంది. సునీల్ బార్వే నటన కూడా చాలా బావుంది.