twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృతి తప్పిన రిథం

    By Staff
    |

    Rythm
    చిత్రం: రిథమ్‌
    నటీనటులు: అర్జున్‌, మీనా, జ్వోతిక, రమేష్‌ అరవింద్‌, నాగేష్‌, లక్ష్మి
    సంగీతం: ఏ.ఆర్‌.రెహమన్‌
    పాటలు:వేటూరి
    మాటలు: శ్రీరామకృష్ణ
    నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వసంత్‌

    ఇద్దరు కలిసి ఉండాలని రాసి ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని మలుపులు తిరిగినా చివరికి తప్పకుండా వారిద్దరు కలిసి తీరుతారు. దాన్నే తలరాత అంటారు. బ్రహ్మగీత అని కూడా అంటారు. దీన్ని కథగా మలిచి సినిమా తీస్తే రిథమ్‌ అవుతుంది. ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎన్నుకొని దర్శకుడిగా పేరొందిన వసంత్‌ ఈసారి సాదాసీదా కథనే సినిమాగా మలిచాడు. ప్రేమకథలు క్లిక్‌ కావాలంటే ఉండాల్సింది-అద్భుతమైన సంగీతం, అందమైన దృశ్యాలు. ఇందులో ఆ రెండు ఉన్నాయి. కానీ కథనంలో పట్టులేదు. ఏ.ఆర్‌.రెహమన్‌ అందించిన సంగీతమే ఈ చిత్రానికి ఎస్సెట్‌. వసంత్‌ గత సినిమాల్లాగే (ఆశ,..ఆశ..ఆశ.., మహారాణి) సన్నివేశాల్లో 'స్లో నెస్‌' ఈ సినిమాకు ప్రధానలోపం. గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కేరళ అందాలు, హైదరాబాద్‌, బొంబాయి, చెన్నై నగరాల అందాలతో సినిమాలో రిచ్‌ నెస్‌ ఉన్నా స్క్రీన్‌ ప్లే సినిమాను దెబ్బతీసింది.

    అర్జున్‌, జ్యోతిక యువదంపతులు. పెళ్ళయిన తర్వాత ప్రేమించుకుంటూ ఆనందంగా గడుపుతారు. జ్వోతికకు ఒక్కటే అసంతృప్తి. బాంబు డిస్పోజబల్‌ స్క్వాడ్‌ టీంలో అర్జున్‌ పనిచేయడం ఆమెకు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందనని ఆమె భయం. ఆమె ఇష్టం ప్రకారం జాబ్‌ కు రిజైన్‌ చేస్తాడు అర్జున్‌. వేరే ఊరు వెళ్ళిన జ్వోతిక ఈ విషయం విని సంతోషంతో భర్త దగ్గరికి వచ్చేందుకు పయనమవుతుంది. ఆమె ప్రయాణిస్తున్న ట్రైయిన్‌ యాక్సిడెంట్‌ అయి మరణిస్తుంది. దాంతో అర్జున్‌ ప్రొఫెషన్‌ మార్చుకొని ఫోటో జర్నలిస్ట్‌ గా మారుతాడు. బొంబాయి ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో ఫోటో ఎడిటర్‌ గా వస్తాడు. అక్కడ మీనా పరిచయమవుతుంది.

    మీనాకు అప్పటికే పెళ్ళవుతుంది. ఆమె భర్త (రమేష్‌ అరవింద్‌) కూడా జ్వోతిక ప్రయాణిస్తున్న ట్రెయిన్‌ కు జరిగిన యాక్సిడెంట్‌ లో మరణిస్తాడు. రమేష్‌ ఆశయాలకు అనుగుణంగా ఒక అనాధను తన కొడుకుగా పెంచుకుంటూ బొంబాయిలో ఉద్యోగం చేస్తుంటుంది. మీనాకు, అర్జున్‌ కు పెళ్ళి జరిగితే బావుంటుందని అర్జున్‌ తల్లితండ్రులు భావిస్తారు. ఇదే విషయాన్ని మీనాను అడుగుతారు. మీనా అందుకు ఒప్పుకోదు. ఒంటరిగానే బతుకుతానని చెప్పుతుంది. కానీ పక్కింటిమొగుడు చూపు తనపై పడ్డప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంటుంది. పెళ్ళికి ఓకే అని చెప్పేందుకు రెడీ అవుతుంది. సడెన్‌ గా మీనా అత్తగారు వచ్చి వాళ్ళ ఊరుకు తీసుకెళ్ళుతుంది- తనకు తోడుగా ఉండమంటూ. వాళ్ళ ప్రేమకు దీంతో బ్రేక్‌. ఆల్‌ ఈజ్‌ వెల్‌ దట్‌ ఎండ్స్‌ వెల్‌ కాబట్టి చివరికి వాళ్ళిదరు ఒకటవుతారు.

    అర్జున్‌, మీనా లు ఇద్దరూ మెచ్యుర్డ్‌ లవర్స్‌ పాత్రలను చక్కగా పోషించారు. జ్వోతిక, రమేష్‌ అరవింద్‌ ల పాత్ర చాలా స్వల్పం. మిగతానటీనటుల గురించి చెప్పుకోదగ్గ పాత్రలు కావు. ఇది ఖచ్చితంగా ఏ.ఆర్‌.రెహమన్‌ చిత్రం. పంచభూతాలను దృష్టిలో పెట్టుకొని కంపోజ్‌ చేసిన ఐదు పాటలు కూడా చాలా బావున్నాయి. పాడుచిచ్చు...పాడు చిచ్చు అనే పాటలో రమ్యకృష్ణ డాన్స్‌ కూడా ఆకట్టుకుంటుంది. వసంత్‌ స్క్రీన్‌ ప్లే మీద దృష్టిపెడితే చిత్రం రిథమిక్‌ గా ఉండేది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X