Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్వామి - సమీక్ష
నటీనటులు: హరికృష్ణ, మీనా, ఆమని, ఉమ,
రాజీవ్ కనకాల, జయప్రకాష్రెడ్డి, చలపతిరావు, మోహన్రాజ్ తదితరులు
సంగీతం: కీరవాణి
కథ, మాటలు: పోసాని కృష్ణమురళి
నిర్మాత: ఆర్.కె.భగవాన్, తేజ
స్క్రీన్ప్లే, దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
హరికృష్ణ 'సీతయ్య', 'టైగర్ హరిశ్చంద్రప్రసాద్'లాంటి అట్టర్ఫ్లాఫ్ చిత్రాల తర్వాత మరో సాధారణ చిత్రాన్నే అందించాడు. గుంటూరులో జరిగిన ఓ నిజమైన ఘటన ఆధారంగా కథ రూపొందించినట్లు పోసాని కృష్ణమురళి ప్రకటించినప్పటికీ, ఆయన ట్రేడ్మార్క్ ఛీఫ్ డైలాగ్స్, రోటీన్ కథనంతోనే సినిమా సాగింది. హరికృష్ణ భావావేశాల ప్రదర్శన బాగానే ఉన్నా, ఆయన నటనకు ఊతం ఇచ్చే కథ, కథనం లేదు. పగ, ప్రతీకారం అనే ఫార్మూలా కథకు చెల్లెలు సెంటిమెంట్, భర్త చెల్లెలను పెంచడం కోసం భార్య (మీనా) తన గర్భాశయాన్ని తొలగించుకోవడం వంటి దృశ్యాలు మరీ తమిళ సినిమాల మాదిరి రోటీన్ పద్దతి. మరీ నాసిరకం సినిమా ఇది.
వేణుగోపాల స్వామి ముద్దుగా స్వామి (హరికృష్ణ) రైస్ మిల్ యజమాని. ఆయనకు ఇద్దరు కవల చెల్లెల్లు(ఉమ). వీరిని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో స్వామి భార్య(మీనా) తన గర్భాశయాన్ని తొలగించుకొంటుంది. మెడికల్ కాలేజ్లో చదువుతోన్న సీత(ఉమ)ని హౌస్ సర్జెన్ చేస్తోన్న ఆనంద్(రాజీవ్ కనకాల) ప్రేమిస్తున్నట్లు నమ్మించి, ఆమెను మోసగించి అనుభవిస్తాడు. సీత సోదరి (మళ్ళీ ఉమనే)తో కూడా అదే నాటకం ఆడాలని ప్రయత్నించి విఫలమవుతాడు. తన ప్లాన్ బయటపడడంతో, వారిద్దరిని వేటాడి కిరాతకంగా చంపేస్తాడు. స్వామి దంపతులు దీంతో షాక్కు గురై, న్యాయం కోసం పోరాడి విఫలమవుతారు. అప్పుడు స్వామి తన 'విశ్వరూపాన్ని' ప్రదర్శించి, ఆనంద్, ఆయన తండ్రి (జయప్రకాష్ రెడ్డి), ఇంకా ఇతరులను చంపి కక్ష తీర్చుకోవడం మిగతా కథ..
హరికృష్ణ ఆవేశపూరితమైన నటన బాగానే ఉంది. కానీ ఆయన డైలాగ్స్ నాసిరకంగా ఉన్నాయి. పోసాని రూపొందించిన ఈ కథ ప్రస్తుతానికి టాపికల్ అనే చెప్పాలి (శ్రీలక్ష్మి, మనోహర్ కేసు ఉదంతం నేపథ్యంలో). కానీ ఆయన ప్రతిదాన్ని 'అతి' చేయడం మానుకోవడం మంచిది. అంత 'అతి'ని తట్టుకోవాలంటే సామాన్య ప్రేక్షకులకు చాలా నిబ్బరం కావాలి. మీనా ఓకే. ఆమని పాత్ర స్వల్పం. కీరవాణి సంగీతం మోస్తారుగానే ఉంది. వి. ఆర్.ప్రతాప్ మరోసారి విఫలమయ్యాడు.