Don't Miss!
- News కాంగ్రెస్ ఒకేఒక్క అజెండా అదే; కుత్సితమైన చిల్లర రాజకీయం: భగ్గుమన్న కేటీఆర్
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్లో భారీ సెట్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవలే లాంగ్ షూటింగ్ షెడ్యూల్ గోవాలో పూర్తయింది. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా చిత్రం బృందం హైదరాబాద్లో సాంగ్ షూటింగ్ పనిలో నిమిగ్నమైంది. ఇందుకోసం భారీ ఖర్చుతో సెట్ వేశారు. ఈ సెట్లో 'దిమాక్ ఖరాబ్' అనే పాటను చిత్రీకరించబోతున్నారట. తెలంగాణ టచ్తో సాగే ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కంపోజ్ అందించనున్నారు. రామ్ పోతినేని గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన డాన్స్ పెర్పార్మెన్స్తో మెప్పిస్తారని చిత్ర బృందం చెబుతోంది.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న 'దిమాక్ ఖరాబ్' పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, కీర్తన శర్మ, సాకేత్ ఆలకించారు. రామ్ అభిమానులను ఊర్రూతలూగించే విధంగా ఈ పాట ఉంటుందట.
'ఇస్మార్ట్ శంకర్' మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.