Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
సస్పెన్స్ కొనసాగిస్తూనే అక్కినేని వారసుడు స్టార్ట్ చేసేశాడుగా..
హీరోగా అక్కినేని అఖిల్ ఇంతవరకు మంచి బ్రేక్ రాబట్టలేక పోయాడు. గతంలో ఆయన చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఆశించిన మేర ఫలితాలు రాబట్టలేక పోయాయి. దీంతో నాలుగో సినిమాతో నైనా బ్రేక్ తెచ్చుకొని కెరీర్ స్టాండ్అప్ చేసుకోవాలని భావిస్తున్నాడు అఖిల్. ఈ మేరకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా గత నెలలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. కానీ హీరోయిన్ సెట్ కాకపోవడంతో ఇన్ని రోజులు ఆగి తాజాగా రెగ్యులర్ షూట్ మొద్దుపెట్టేశారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే హీరోయిన్ విషయంలో సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ అఖిల్, ఇతర తారాఫేనంతో కానిచ్చి సెకండ్ షెడ్యూల్ వరకల్లా హీరోయిన్ ని ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.
అఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్.. మొదట రష్మిక మందన్న, కియారా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్ల పేర్లను పరిశీలించాడు. కానీ ఆ హీరోయిన్లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా తాజాగా మరో హీరోయిన్ నివేద పేతురాజ్ ను ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేయాలని నిర్ణయానికి వచ్చాడని తెలిసింది. కానీ అఫీషియల్ గా ప్రటించకుండానే సస్పెన్స్ కొనసాగిస్తూ అఖిల్ 4 రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేయడం విశేషం. ఇంకా పేరు కూడా ఫిక్స్ చేయని ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.