Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అల్లు అర్జున్కు ఫ్యాన్స్ గ్రాండ్ వెలకం... భావోద్వేగానికి గురైన బన్నీ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా షూటింగ్ కాకినాడకు షిప్ట్ అయింది. ఆల్రెడీ బన్నీ కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు గ్రాండ్ వెలకం చెప్పారు.
అల్లు అర్జున్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి ముందే భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. కాకినాడ టౌన్ మొత్తం బన్నీకి స్వాగతం పలుకుతూ ప్లెక్సీలతో నిండిపోయింది. ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా తమ అభిమాన హీరోను తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాకినాడ సముద్రతీరంతో పాటు టౌన్లోని కొన్ని ఏరియాల్లో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు.ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్.
'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని బన్నీ.... ఈ సారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో ఈ చిత్రం చేస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు 'నాన్న నేను' అని పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో తండ్రి సెంటిమెంట్ చూపించబోతున్నారట. స్వాతంత్ర దినోత్సవం సందర్భగా ఆగస్టు 15న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.