Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్పెయిన్లో కాజల్, శర్వానంద్.. 250 మందితో క్రేజీగా!
స్వామిరారా చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సుధీర్ వర్మ దర్శకుడిగా విజయవంతం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత దోచెయ్, కేశవ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈ యువదర్శకుడు శర్వానంద్ హీరో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్. గ్యాంగ్ స్టర్ కథగా థ్రిల్లర్ అంశాలతో సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శర్వానంద్ విభిన్నమైన లుక్ లో కనిపించనున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. కాజల్ అగర్వాల్, శర్వానంద్ పై భారీ ఖర్చుతో ఓ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో 250 మంది డాన్సర్లు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్వరలోనే టైటిల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
శర్వానంద్ చివరాగా నటించిన పడిపడిలేచే లేచే మనసు చిత్రం నిరాశపరిచింది. దర్శకుఢు సుధీర్ వర్మ, శర్వానంద్ ఇద్దరూ ఈ చిత్రంతో విజయాన్ని అందుకుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఈచిత్రం తర్వాత శర్వానంద్ దిల్ రాజు నిర్మాణంలో 96 రీమేక్ లో నటించాల్సి ఉంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రంపై దిల్ రాజు నమ్మకంతో ఉన్నారు.