Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వైరల్గా సరిలేరు నీకెవ్వరు సెట్.. కళ్లు చెదిరేలా ఫిల్మ్సిటీలో కొండారెడ్డి బురుజు
భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్న సూపర్స్టార్ మహేశ్బాబు, రాజాది గ్రేట్, F2 వరుస సక్సెస్లను సొంతం చేసుకొన్న అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఫ్యాన్స్కు సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం నుంచి టైటిల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ను సైనికులకు డెడికేట్ చేస్తూ సైనికుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కుతున్న చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో కళ్లు చెదిరే సెట్ వేశారు.
కర్నూలు జిల్లాకే తలమానికంగా మారిన కొండారెడ్డి బురుజు సెట్ను రామోజీ ఫిలిం సిటీలో వేశారు. ఆ సెట్కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. నిజంగా కొండారెడ్డి బురుజా అనే ఫీలింగ్ను కలిగించేలా సెట్ ఉండటంతో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.