twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    30 ఏళ్ల తర్వాత ఇలా... విజయశాంతి గురించి మహేష్ బాబు ట్వీట్!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం 'సరి లేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ప్రముఖ నటి విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు.

    చైల్డ్ ఆర్టిస్టుగా విజయశాంతితో 'కొడుకు దిద్దిన కాపురం' మూవీలో కలిసి పని చేసిన మహేష్ బాబు... దాదాపు 30 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఆమెతో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ సూపర్ స్టార్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

    1989లో తొలిసారి విజయశాంతి గారిని కలిశానంటూ...

    ‘‘1989లో తొలిసారిగా విజయశాంతిగారిని కలిశాను. లొకేషన్ ‘కొడుకు దిద్దిన కాపురం' మూవీ సెట్స్. 30 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారితో మళ్లీ కలిసి పని చేస్తున్నాను. లైఫ్ ఒక ఫుల్ సర్కిల్ తిరిగినట్లు ఉంది.'' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    విజయశాంతి పాత్ర ఏమిటంటే..

    విజయశాంతి పాత్ర ఏమిటంటే..

    ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు ఫ్రెండ్ తల్లిపాత్రలో విజయశాంతి కనిపించబోతున్నట్లు సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ప్రిపేర్ అవుతున్నారు. రోజూ జిమ్‌కు వెళ్లి వర్కౌట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆమె స్లిమ్ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

    మహేష్ బాబుతో రీ ఎంట్రీపై హ్యాపీ

    మహేష్ బాబుతో రీ ఎంట్రీపై హ్యాపీ

    రీ ఎంట్రీపై విజయశాంతి స్పందిస్తూ.. 'కిలాడి కృష్ణుడు సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. 180 సినిమాలు చేశాను. నా రాజకీయ జీవితంలో 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.'' అని తెలిపారు.

    సరిలేరు నీకెవ్వరు

    సరిలేరు నీకెవ్వరు

    ‘సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్. ప్రకాష్ రాజ్, నరేష్, సంగీత, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, ప్రదీప్ రావత్, వెన్నెల కిషోర్, పవిత్ర లోకేష్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 10, 2020న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    "It all started here ..⏳ Year - 1989, Location - Sets of Koduku Diddina Kapuram, 30 years later ⌛, I'm working with vijayashanthi_m garu once again in #SarileruNeekevvaru... life has come a full circle...😇#throwbackthursday #nostalgia" Mahesh Babu tweeeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X