మహర్షి మూవీ లేటెస్ట్ అప్డేట్.. షూటింగ్ పూర్తయ్యేది ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రం చెన్నై షెడ్యూల్ సోమవారం(మార్చి 11)న పూర్తయింది. నేటి(మార్చి 12) నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది.
హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం దుబాయ్ వెళ్లబోతున్నారు. దుబాయ్లో రెండు పాటల చిత్రీకరణ జరిపేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ రెండు పాటల చిత్రీకరణతో సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

మహేష్ బాబు కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీగా 'మహర్షి' చిత్రం తెరకెక్కుతోంది. సినిమా మొదలవ్వడానికి రెండేళ్ల ముందే ఈ కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు.. సూపర్ స్టార్ డేట్స్ కోసం సుధీర్ఘకాలం వెయిట్ చేసి మరీ ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో వచ్చిన ది బెస్ట్ మూవీగా ఇది ఉండబోతోందట.
'భరత్ అనే నేను' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











