సైరా యుద్ధం.. రోమాలు నిక్కబొడుచుకునేలా, స్టిల్స్ వైరల్, 35 రాత్రుల్లో!
Recommended Video

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 200 కోట్లు. అందుకు తగ్గట్లుగానే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశానికి సంభందించిన షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ముగించింది. ఈ చిత్ర కెమెరామాన్ రత్నవేలు ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మనం ఇంతవరకు విన్నాం. ఆయన వీరత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి రూపంలో చూడబోతున్నాం. అతిరధ మహారధులు లాంటి నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

రోమాలు నిక్కబొడుచుకునేలా
తాజగా సోషల్ మీడియాలో సైరా చిత్రానికి సంబందించిన స్టిల్స్ వైరల్ గా మారాయి. నైట్ ఎఫెక్ట్ లో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు సంబందించిన ఈ స్టిల్స్ రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉన్నాయి. గుర్రాల, భారీ సెట్ వర్క్ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.

35 రాత్రుల్లో
ఈ యుద్ధ సన్నివేశాల్ని 35 రాత్రుల్లో తెరకెక్కించామని ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. వర్షం ఇబ్బంది పెట్టినా విజయవంతంగా చిత్రీకరణ జరిపాం. బ్రిటిష్ ఆర్మీ, ఫిరంగుల, గుర్రాల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాం. ఏ చిత్రీకరణ మొత్తం అతి తక్కువ కాంతిలో జరిగినట్లు తెలిపారు.

బ్రిటిష్ వారిపై దండెత్తే సన్నివేశం
సైరా నరసింహారెడ్డి తన బలగంతో బ్రిటిష్ వారిపై దండెత్తే నేపథ్యంలో ఈ యుద్ధం జరుగుతుంది. చిత్రంలో ఈ సన్నివేశం అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు.

భారీ తారాగణం
ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్. జగపతి బాబు, తమన్నా వంటి నటులు నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు కాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











