Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బార్బేక్యూ పార్టీలో నాగ్.. జోష్.. రకుల్పై మంచు లక్ష్మీ అసహనం.. లీక్ చేసిన వెన్నెల కిషోర్
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న మన్మథుడు షూటింగ్ కొద్దిరోజులుగా పోర్చుగల్లో జరుగుతున్నది. హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం రెండు వారాల క్రితం చిత్ర యూనిట్ పోర్చ్గల్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మన్మథుడు2 కుటుంబం అంటూ నాగార్జున సెల్ఫీ దిగి ట్వీట్ చేయడం జరిగింది. ఊహించిన దానికంటే భిన్నంగా మన్మథుడు షూటింగ్ జోష్తో జరగడంతో చిత్ర యూనిట్ జర్నీ సంతోషంగా సాగింది. మన్మథుడు షూటింగ్లో భాగంగా యూనిట్ సభ్యులందరూ బార్బేక్యూ విందు చేసుకొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్పై మంచు లక్ష్మీ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే..
రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్
బ్యాక్ యార్డ్ బార్బేక్యూ పార్టీని ఎంజాయ్ చేస్తూ రకుల్ ప్రీత్ ట్వీట్ చేశారు. ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నాను. అంతా పాజిటివ్ వైబ్స్తో ఉంది. గ్రేట్ కంపెనీ, రుచికరమైన ఫుడ్, బాగా తింటున్నాను. ఎడతెరిపి లేకుండా నవ్వుతో సమయాన్ని మధురానుభూతిగా మలుచుకొంటున్నాం అని అన్నారు.
ఆలస్యంగా వెన్నెల కిషోర్, మంచు లక్ష్మీ
కింగ్ నాగార్జున ఇచ్చిన పార్టీకి రకుల్ ప్రీత్తోపాటు అందరూ కరెక్ట్ సమయానికే హాజరయ్యారు. వెన్నెల కిషోర్, మంచు లక్ష్మీ మాత్రమే ఆలస్యంగా వెళ్లారు. వెన్నెల కిషోర్ ఆలస్యాన్ని ఉద్దేశించి నాగార్జున ఆసక్తికరమైన కామెంట్ చేశారు. కిషోర్ మీలాంటి డిజిటల్ వ్యసనపరులు కోసమే ఇలాంటి పార్టీ ఏర్పాటు చేశాం. కానీ మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు. బీ హ్యాపీ అంటూ ట్వీట్ చేశారు.
ఆలస్యానికి కారణంపై.. వెన్నెల కిషోర్
నాగార్జున ట్వీట్కు వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. ఆలస్యానికి చింతిస్తున్నాం. మా ఆలస్యానికి కారణం ఇదే అని పేర్కొన్నాడు. ట్వీట్కు వీడియోను జతచేసి తమ ఆలస్యానికి కారణం వెల్లడించాడు. ఆ వీడియోలో.. మనం లేటుగా రావడంపై నాగార్జున సార్ గుర్రుగా ఉన్నారు. వెయిటింగ్ చేస్తున్నారు అని కిషోర్ అన్నారు.
|
రకుల్ ప్రీత్పై మంచు లక్ష్మీ ఫైర్
వెన్నెల కిషోర్ పోస్టు చేసిన వీడియోలో మంచు లక్ష్మీ కోపంగా కారులో కూర్చొని గోళ్లు గిల్లుకొంటున్నారు. నా ఆలస్యానికి కారణం రకుల్ ప్రీత్ సింగ్. మనలను లోపల వదిలేసి చెప్పకుండా వెళ్లిపోయింది. అందుకే లేట్ అయింది. మళ్లీ రకుల్కు చెప్పకు.. మనపై కేవ్ కేవ్ అంటుంది అని మంచు లక్ష్మీ అసహనం వ్యక్తం చేసింది. అయితే నేను చెప్పను కానీ.. ఈ వీడియోను ట్వీట్ చేస్తాను అని వెన్నెల కిషోర్ ట్వీట్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
|
నాగార్జున, అమల పార్టీ
మన్మథుడు 2 షూటింగ్ జోష్గా సాగుతుండటంతో చిత్ర యూనిట్కు నాగార్జున, అమల దంపతులు బ్యాక్యార్డ్లో బార్బేక్యూ పార్టీని ఏర్పాటు చేశారు. దానికి మంచు లక్ష్మీని కూడా ఆహ్వానించారు. అయితే మంచు లక్ష్మీ ఆలస్యంగా రావడంతో నాగార్జున ట్వీట్ చేశారు. ఆ లేటు కారణాన్ని వెన్నెల కిషోర్ తనదైన శైలిలో లీక్ చేశారు. అలాగే పార్టీని ఏర్పాటు చేసినందుకు నాగ్ సర్కు థ్యాంక్స్ అంటూ కిషోర్ ట్వీట్ చేశారు.