Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అభిమానుల మనసు దోచుకున్న మెగా హీరో!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రలహరి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మించిన భారీ సెట్ లో జరుగుతోంది. తనని చూసేందుకు వచ్చిన అభిమానుల విషయంలో తేజు మనసు దోచుకునే పని చేశాడు. అక్కడ వచ్చిన అభిమానులందరితో సెల్ఫీలు దిగిన తేజు వారందరికీ భోజనం ఏర్పాట్లు చేశాడు.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరంభం నుంచి తేజు అభిమానులతో చేరువగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు అందుకున్న తేజు ఇటీవల వరుస పరాజాయాలతో డీలా పడ్డాడు. తేజు కెరీర్ మళ్ళీ పుంజుకోవాలనుంటే చిత్రలహరి చిత్రం తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ చిత్రం కోసం సాయిధరమ్ తేజ్ గడ్డం లుక్ లో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రంలో హీరోయిన్లుగా కళ్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్ నటిస్తున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని ట్రైయాంగిల్ ప్రేమ కథగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ లో ఈ చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు.