Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Vijay Deverakonda సమంతపై రూమర్లు.. ఖండించిన దర్శకుడు అసలు జరిగిందేమిటంటే?
లైగర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవల జమ్ము, కాశ్మీర్లో జరిగింది. ఈ షూటింగ్ సందర్భంగా విజయ్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. సమంత, శివ నిర్వాణ, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఇటీవల షూటింగ్ ముగించుకొని ఖుషీ టీమ్ హైదరాబాద్కు చేరుకొన్నది. అయితే ఖుషి సినిమా షూట్లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయ్యాయనే వార్త జాతీయ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వార్తను ఖుషీ పీఆర్ టీమ్ ఖండించింది.
Recommended Video
జాతీయ దినపత్రికల్లో కథనం ప్రకారం.. కశ్మీర్లోని పహల్గామ్లో సమంత, విజయ్ దేవరకొండ ఓ స్టంట్ సీన్లో పాల్గొన్నారు. వాహనంలో వెళ్లే సీన్లను చిత్రీకరించారు. చాలా కష్టమైనవి కావడంతో రోప్స్ కూడా కట్టారు. కానీ ఆ కారు లిడ్డర్ రివర్లోకి దూసుకెళ్లింది. లోతైన ప్రాంతంలో వారు పడ్డారు. వెన్నుముక ప్రాంతంలో సమంత, విజయ్ దేవరకొండకు గాయలు అయ్యాయి అని పేర్కొన్నారు. ఈ ఘటన శనివారం శ్రీనగర్లోని దాల్ లేక్ సమీపంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరిని హోటల్కు తరలించారు. అనంతరం వారికి ఫిజియోథెరపీ చేయించారు అని కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని ఖుషీ పీఆర్ వర్గాలు ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ఫుల్గా కాశ్మీర్లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు అని ఖుషీ పీఆర్ వర్గాలు వెల్లడించాయి
దర్శకుడు శివ నిర్వాణ కూడా ప్రమాదం జరిగిందనే వార్తలో నిజం లేదు. ఫేక్ వార్త అంటూ ట్వీట్ చేశారు.