Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ని సర్ప్రైజ్ చేసిన శింబు.. మహర్షి సెట్లో!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని రైతు సమస్యల నేపథ్యంలో సందేశాత్మక అంశాలతో రూపొందిస్తున్నారు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో శింబు మహేష్ బాబుని సర్ ప్రైజ్ చేశాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం!
8 కోట్ల సెట్లో షూటింగ్
మహర్షి చిత్రంలో విలేజ్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దీనికోసం 8 కోట్ల భారీ ఖర్చుతో రామోజీ ఫిలిం సిటీలో భారీ విలేజ్ సెట్ ని నిర్మించారు. అత్యద్భుతంగా ఈ సెట్ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. పల్లెటూరిలో రైతు సమస్యలు, అల్లరి నరేష్ తో మహేష్ నటించే సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయని అంటున్నారు.
సందడి చేసిన శింబు
మహర్షి షూటింగ్ జరుగుతున్న సమయంలో తమిళ స్టార్ హీరో శింబు మహర్షి సెట్ లోకి వెళ్ళాడు. కాసేపు సూపర్ స్టార్ మహేష్ తో కలసి సందడి చేశాడు. మహేష్, శింబు సెట్ లో ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో మహేష్ క్లీన్ షేవ్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చిన సీఈవో పాత్రలో మహేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
పక్కనే కావడంతో
శింబు ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతోంది. పక్క పక్కనే కావడంతో శింబు మహేష్ ని కలసి ఆప్యాయంగా పలకరించినట్లు తెలుస్తోంది. అత్తారింటికి దారేది రీమేక్ వంత రాజవతాన్ వరువేన్ పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుందర్ సి తెరకెక్కిస్తున్నారు.
సేంద్రియ వ్యవసాయం
ఇదిలా మహర్షి చిత్రంలో సేంద్రియ వ్యవసాయానికి సంబందించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, అల్లరి నరేష్ మధ్య స్నేహానికి సంబందించిన సన్నివేశాలు కథలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయట. మహేష్ సరసన ఈ చిత్రం క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.