Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వేగంగా కారు నడిపిన విజయ్ దేవరకొండ.. యాక్సిడెంట్.. ఎక్కడ, ఎలా అంటే!
Recommended Video
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వేగంగా కారు నడపడంతో ఆ కారు యాక్సిడెంట్కి గురైందని తెలుస్తోంది. అంతేకాదు ఆయనను వెనుక నుంచి రౌడీలు కూడా వెంటాడారట. అరె! ఇదేదో సినిమా సన్నివేశం లాగానే అనిపిస్తుందే.. అనుకుంటున్నారు కదూ. నిజమే ఇదంతా రియల్గా కాదు.. విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో. ఇంతకీ పూర్తి వివరాలేంటి? అంటారా..
డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ
ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన విజయ్ దేవరకొండ ఈ సారి మరింత స్ట్రాంగ్గా దిగాలని ఫిక్స్ అయ్యాడట. ఈ మేరకు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఫ్రాన్స్ నుంచి వచ్చి.. హైదరాబాద్లో
ఈ సినిమా తొలి షెడ్యూల్ ఫ్రాన్స్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఆ వెంటనే హైదరాబాద్ వచ్చిన చిత్రయూనిట్ గత నాలుగు రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఓ సీన్ షూట్ చేశారట. ''విజయ్ దేవరకొండ కారు వేగంగా నడుపుతుంటే ఆయన వెనక రౌడీలు పడటం.. అనూహ్యంగా విజయ్ నడుపుతున్న కారు యాక్సిడెంట్కు గురి కావడం'' అనే సీన్ చిత్రీకరణ జరిగిందట.
విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్లు
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ లుక్ బయటకు వచ్చి వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఇంకా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ డిఫెరెంట్ గా ఉంటుందని, ఆయన ఓ రైటర్గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మూవీ
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.