మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా కోసం విలేజ్ సెట్
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహర్షి'. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ యూఎస్ఏలో ప్లాన్ చేశారు. ఇటీవలే వీసా ప్రాసెస్ పూర్తయింది. న్యూయార్క్తో ఇతర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగబోతోంది.
యూఎస్ఏ షెడ్యూల్ పూర్తయిన తర్వాత 'మహర్షి' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగబోతోంది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా విలేజ్ సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు ఆధ్వర్యంతో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సెట్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానకి కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.
వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వై జయంతి మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











