Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్తో సుకుమార్ క్రియేట్ చేసిన వండర్.. రంగస్థలం మూవీకి మూడేళ్లు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో ఎప్పటికి గుర్తుండి పోయే సినిమాలు చాలా తక్కువ. అలాంటి సినిమాల్లో రంగస్థలం ఒకటి. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఈ సినిమా చూసిన తరువాత కొంతైనా ఈర్ష పడకుండా ఉండలేరు. భవిష్యత్తులో ఇలాంటి సినిమా వస్తే అస్సలు వదులుకోకూడదని అనుకుంటారు.
సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం విడుదలై నేటికి మూడేళ్లవుతోంది. 2018 మార్చి 30న గ్రాండ్ గా విడుదలైన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద 200కోట్లను కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ ను పొగడకుండా ఉండలేరు. స్టార్ రేంజ్ ను ఏ మాత్రం లెక్క చేయకుండా చిట్టిబాబు పాత్రలో ఎంతగానో ఒదిగిపోయి మెప్పించాడు.
ఇక సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో సినిమా పేరును ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత డైరెక్టర్ సుకుమార్ పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో మరో మ్యాజిక్ ను సిద్ధం చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో రామ్ చరణ్ తో మరో సినిమా కూడా చేసే అవకాశం ఉందని మైత్రి మూవీ మేకర్స్ వివరణ ఇచ్చింది.