Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆదిని ఎత్తుకున్న చిరంజీవి.. అసలు కథ ఏంటంటే?
చిరంజీవి కుటుంబానికి, సాయి కుమార్ ఫ్యామిలీకి ఎంతో సాన్నిహిత్యం సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో సాయి కుమార్ చిన్న చిన్న రోల్స్ను చేశాడు. సాయి కుమార్ తన కెరీర్ మొదట్లో చిరంజీవితో కలిసి నటించాడు. అలా అక్కడి నుంచి మొదలైన బంధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా పరిచయమైన ప్రేమ కావాలి చిత్రానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.
తన చిన్నతనంలో చిరుతో ఉన్న అనుబంధాన్ని తెలిపే ఓ ఫోటోను షేర్ చేశాడు ఆది సాయి కుమార్. ఇంతకీ ఆ కథ ఏంటంటే.. చంద్ర మోహన్, జయసుధ, సాయి కుమార్, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించిన 'కలికాలం' సినిమా 1991లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందుకు మెగాస్టార్ చేతుల మీదుగా సాయికుమార్కు ఇవ్వాల్సిన షీల్డ్ను ఆయన కొడుకు ఆదికి అందించారు.
ఆ సమయంలో ఆదిని చిరు ఎత్తుకున్నారు. ఈ ఫొటోను ఆది తాజాగా తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాల్లో షేర్ చేశాడు. 'డ్యాడ్ తరఫున కలికాలం సినిమాకు నేను అవార్డు అందుకున్నాను' అని పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమాకు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కళావాహిని అవార్డు కూడా అందుకున్నారు. ఇలా క్వారంటైన్లో ఆది తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటాడు. రీసెంట్గా తన లుక్కు సంబంధించిన ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు.