Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
మాధవీలత జీవితంలో కొత్త దశ ఆరంభం.. ఆ పోస్ట్ ఆర్థం అదేనా?.. డైలామాలో నెటిజన్స్
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ వస్తోంది మాధవీలత. సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్న మాధవీలత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో పార్టీ తరపున, ఆమె చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకుంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలు కూడా పంచుకుంటూ ఉంటుంది. అక్కడే వస్తుంది అసలైన చిక్కు. వ్యక్తిగతమైన అభిప్రాయాలను పోస్ట్ చేయడంతో అవి వివాదానికి దారి తీస్తాయి. గత కొన్ని రోజులుగా సాధినేని, శ్రీ రెడ్డి, చిత్రపురి కాలనీ, లాక్డౌన్లో మద్యం, సెలెబ్రిటీలు వివాహాలు చేసుకోవడంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
వివాదాస్పదమైన పోస్ట్లు..
చిత్రపురి కాలనీ జరిగే మోసాలు,అన్యాయాల గురించి చేసిన పోస్ట్ తెగ హల్చల్ చేసింది. సాధినేని యామినిని బీజేపీలో చేర్చుకోవడంపై మాధవీలతా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మధ్యలో కలగజేసుకున్న శ్రీరెడ్డిపైనా సెటైర్లు వేసింది. లాక్డౌన్లో సెలెబ్రిటీల వివాహాలపైనా మండిపడింది.
మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా?
లాక్డౌన్లోనూ పెళ్లిళ్లు చేసుకోవడంసై పోస్ట్ చేస్తూ.. ‘అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్క్లు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు?.. ముహూర్తం మళ్లీ రాదా ఇది పోతే.. శ్రావణం కాకపోతే మాఘ మాసం లేకుంటే మరో ఏడాది? పిల్ల దొరకదా? పిల్లొడు మారిపోతడ.. అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకటా? మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా?' అంటూ ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేసింది.
ఆ పోస్ట్తో కొత్త అనుమానాలు..
మాధవీలతా పోస్ట్ సారాంశం.. ‘నూతన సాయంత్రం.. నూతన హృదయాలతో జీవితంలోని కొత్త దశ ప్రారంభం.. ఇది వరకెన్నడూ లేని విధంగా ఇది చిగురించాలని ఆశిస్తున్నా.. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా'అని చెప్పుకొచ్చింది.
మరో పోస్ట్తో మరింత కన్ఫ్యూజన్..
‘జీవితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాకపోతే ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకోవాలి.. నాతో పాటు ఉండే మనుషులందరూ సహృదయులు.. అలాంటి వారు నా పక్కన కావాల్సినంత మంది ఉన్నారు.. గుడ్ నైట్'అని పేర్కొంది.
Recommended Video
డైలామాలో నెటిజన్స్..
ఇలా కొత్త దశ ప్రారంభం అవుతోందని చెప్పడంపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయిందా? బాయ్ ఫ్రెండ్ దొరికాడా? మ్యాటర్ ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంత మంది లాక్ డౌన్ నాల్గో దశ కదా అని సెటైర్స్ వేస్తున్నారు. అయితే ఆ పోస్ట్లోని అర్థం ఏంటో మాధవీలతకే తెలియాలి.