twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున‌పై అలా కుట్ర జరిగిందా? అడివి శేషు, సుప్రియ‌ అఫైర్‌కు పొలిటికల్ షాక్.. కారణమిదేనా?

    |

    Recommended Video

    Political Angles Were Added To Adivi Seshu And Supriya's Relationship

    రాజకీయాలు, పాలిటిక్స్‌లో ఎవరిపైనైనా బద్‌నాం చేయాలంటే ఏ చిన్న విషయం దొరికినా దానిని మీడియాలో గోరంతలు కొండంతలు చేయడం చాలా సార్లు కనిపించింది. అలాంటి కోవలోనే హీరో అడివి శేష్, నిర్మాత సుప్రియ వ్యవహారం వెలుగుచూసింది. వీరిద్దరి మధ్య అఫైర్ ఉందా, కొనసాగుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే వీరి బంధానికి రాజకీయ రంగు పులిమారానే వాదన సినీ, రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఏపీ రాజకీయాలకు అడివి శేషు, సుప్రియ బలయ్యారా అనే సందేహాలను వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాజకీయాలకు, వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి లింకేమిటని ఆలోచిస్తున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లిపోదాం..

    రాజకీయ కోణం ఉందా?

    రాజకీయ కోణం ఉందా?

    అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ, అడివి శేషు మధ్య అఫైర్ నడుస్తున్నదనేది సినీ వర్గాల్లో తరుచుగా చర్చ జరుగుతున్నది. కానీ వాటికి పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆ వార్త మరుగున పడింది. కానీ ఏపీ ఎన్నికల వేడి రగులుకొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార వర్గానికి అనుకూలమైన మీడియాలో అడివి శేషు, సుప్రియ గురించి వార్త పతాక శీర్షికల్లో ప్రచురించింది. కానీ ఈ వార్త వెనుక రాజకీయ కోణం ఉందా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

    ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

    ఫిబ్రవరి 19 సోమవారం రోజును ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సినీ నటుడు అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. వీరి కలయిక ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో చోటు చేసుకొన్నాయి.

    వైఎస్ జగన్, నాగార్జున భేటికి ముందే

    వైఎస్ జగన్, నాగార్జున భేటికి ముందే

    వైఎస్ జగన్, నాగార్జున భేటీ కాబోతున్నారనే వార్త సోమవారం ఉదయమే మీడియాలో గుప్పుమన్నది. నాగార్జున వైసీపీకి చేరువవుతున్నారనే వార్తతో అధికార పార్టీ ఎత్తుగడలను, వ్యూహాలను రచించింది. అధికార పక్షానికి అనుకూలంగా ఉండే పత్రిక వెబ్‌సైట్‌లో అడివి శేషు, సుప్రియ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. దాంతో మీడియాలో శేషు, సుప్రియ వార్త వైరల్‌గా మారింది.

     వైఎస్ షర్మిలను టార్గెట్‌గా

    వైఎస్ షర్మిలను టార్గెట్‌గా

    గత కొద్దికాలంగా ఏపీ రాజకీయాల్లో కీలక నేతలను టార్గెట్‌గా చేసుకొని మీడియాలో కొన్ని వార్తలను విస్తృతంగా ప్రచారం చేశారు. అందులో భాగంగానే షర్మిల, ప్రభాస్ అఫైర్ వార్త తెలుగు మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా కలకలం రేపింది. ఇటీవల స్వయంగా షర్మిల తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడం, అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది.

    నాగార్జునను కూడా అదే కోణంలో

    నాగార్జునను కూడా అదే కోణంలో

    ఇప్పుడు కూడా నాగార్జున అదే కోణంలో టార్గెట్ చేసుకొన్నారా అనే ప్రశ్న లేచింది. నాగార్జున, జగన్ భేటీకి ముందు ఈ వార్తను వైరల్ చేయడంతో అనేక అనుమానాలు రేకెత్తాయి. ఏపీ పాలిటిక్స్‌లో నాగార్జునపై ఈ విధంగా కుట్ర పన్నారా? అనే వాదన కూడా వినిపిస్తున్నది. ఇంతకీ నాగార్జున వైసీపీలో చేరుతున్నారా? అందుకోసమే జగన్‌ను కలిశారా అనే విషయాలపై కొద్దిరోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Adavi Sheshu, Supriya affair news goes viral in Telugu media. This happend befor YS Jagan and Nagarjuna meeting on Monday. Report suggest that One of AP Governemnts, favoured media attempted this in politcal angle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X