Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రభాస్ వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు, కానీ ఇపుడు భయం మొదలైంది: ‘సాహో’ డైరెక్టర్ సుజీత్
'సాహో' లాంటి రూ. 300 కోట్ల బడ్జెట్ చిత్రాన్ని... కేవలం ఒకే ఒక చిన్న సినిమా 'రన్ రాజా రన్' చేసిన దర్శకుడి చేతిలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడిపై, అతడి పనితీరుపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఏ నిర్మాత కానీ, హీరో కానీ ఇలాంటి సాహసం చేయరు. అలాంటి నమ్మకాన్ని సినిమా మొదలు పెట్టడానికి ముందే కలిగించారు దర్శకుడు సుజీత్. తాజాగా టీజర్ విడుదలైన తర్వాత ఇటు ప్రేక్షకుల్లోనూ అతడిపై కాన్ఫిడెన్స్ పెరిగింది.'సాహో' టీజర్ రిలీజైన సందర్భంగా సుజీత్ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రభాస్ వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు
బాహుబలి లాంటి సినిమా చేసిన ఒక పెద్ద హీరోను డైరెక్ట్ చేస్తున్నప్పటికీ నాపై ఎలాంటి ఒత్తిడి లేదని సుజీత్ తెలిపారు. హీరో ప్రభాస్తో పాటు నిర్మాతలకు నాపై, నా పనితీరుపై పూర్తి నమ్మం ఉంది. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా సాఫీగా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు.
ఇప్పుడు భయం మొదలైంది
సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఎలాంటి భయం లేదు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తెలియకుండానే భయం మొదలైంది. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికీ ఎదురవుతుందని భావిస్తున్నా, సినిమా తాము అనుకున్న విధంగా అద్భుతంగా వచ్చిందని సుజీత్ చెప్పుకొచ్చారు.
అప్పుడే కథ రాయడం మొదలు పెట్టాను
2014లో నా తొలి చిత్రం ‘రన్ రాజా రన్' సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ కోసం కథ రాయడం మొదలు పెట్టాను. సాధారణంగా ఒకటి రెండు నెలల్లో స్క్రిప్టు పూర్తి చేస్తాను. అయితే ‘సాహో'లో యాక్షన్ ఎపిసోడ్స్ రాయడానికి చాలా సమయం పట్టింది. 2015లో యాక్షన్ సీన్స్ నిపుణులను కలిసి చర్చించిన తర్వాత కథ పూర్తి చేశాను. 2017లో బాహుబలి 2 రిలీజ్ ముందే ప్రభాస్కు కథ చెప్పాను. వెంటనే ఒకే చెప్పాడని సుజీత్ తెలిపారు.
శ్రీద్ధా కపూర్ పాత్ర కీలకంగా...
ఈ చిత్రంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. డిఫరెంటుగా ఉండాలనే టీజర్లో మొదట ఆమెను చూపించాం. తెలుగులో ఆమకు ఇది ది బెస్ట్ డెబ్యూ మూవీ అవుతుంది. టీజర్కు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని సుజీత్ వెల్లడించారు.
వారిని తీసుకోవడం వెనక కారణం అది కాదు
ఈ సినిమా కోసం బాలీవుడ్ యాక్టర్లను కావాలని తీసుకోలేదు. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేశ్, చుంకీ పాండే, మందిరాబేడి తదితరులు నేను రాసుకున్న పాత్రలకు పర్ఫెక్టుగా సూటవుతారు కాబట్టే వారిని ఎంపిక చేయడం జరిగింది, అంతే తప్ప మరో ఉద్దేశ్యం లేదని సుజీత్ తెలిపారు. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేసినట్లు ఆయన వెల్లడించారు.