Don't Miss!
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అకీరా మంచి మనసు.. అడివి శేష్కు స్పెషల్ గిఫ్ట్
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాడు. కానీ అప్పుడప్పుడు బయటకు వచ్చే అకీరా నందన్ వార్తలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. పండగలకో పబ్బాలకో అలా అరుదుగా అకీరా ఫోటోలు బయటకు వస్తాయి. అయితే అకీరా నందన్కు ఇష్టమైన హీరో ఎవరై ఉంటారని అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రేణూ దేశాయే ప్రకటించింది. అకీరా తనకు ఇష్టమైన హీరోను కలిశాడని ఆ మధ్య షేర్ చేసిన ఫోటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి.
క్షణం, గూఢచారి, ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్లో క్రేజీ హీరోగా మారిపోయాడు అడివి శేష్. అడివి శేష్ సినిమాలన్నా, అతని రచన అన్నా అకీరాకు చాలా ఇష్టమట. చివరగా వచ్చిన ఎవరు చిత్రాన్ని అకీరా చాలా ఇంట్రెస్టెట్గా చూశాడట. ఈ విషయాలన్నీ రేణూ దేశాయ్ అప్పట్లో సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాలు తెలిసిన అడివి శేష్ అకీరాను ప్రత్యేకంగా కలిశాడు.
ఈ ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు కూడా. అకీరా ఎత్తు ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరు కలిస్తే బాస్కెట్ బాల్ ఆడుతారట. తాజాగా అడివి శేష్ కోసం అకీరా స్పెషల్గా మాస్క్లను గిఫ్ట్ను పంపించాడట. ఈ విషయాన్ని అడివి శేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'థ్యాంక్యూ డియర్ అకిరా.. నువ్ చాలా మంచి వాడివి. మళ్లీ మనిద్దరం కలిసి బాస్కెట్ బాల్ ఎప్పుడు ఆడతామోనని ఎదురుచూస్తున్నా. ఈ మాస్క్లు ఎంతో బాగున్నాయ్.. నాకు నచ్చాయని అకిరాకు చెప్పండ'ని రేణూ దేశాయ్ను కోరాడు. దీనికి రేణూ దేశాయ్ స్పందిస్తూ.. 'నీకు నచ్చినందుకు చాలా సంతోషం.. యాధృచ్చికంగా అకీరా ఇప్పుడు బాస్కెట్ బాలే ఆడుతున్నాడు. మీరు వచ్చినప్పుడు మళ్లీ ఆడండి' అని చెప్పుకొచ్చింది.