Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రోబో2.0 గురించి అక్షయ్ షాకింగ్ న్యూస్.. కేవలం వాటికే రూ.544 కోట్లు!
Recommended Video
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా రూపొందిస్తున్న రోబో సీక్వెల్ 2.0 చిత్రం రిలీజ్కు ముందే భారీగా అంచనాలు పెంచుతున్నది. ఈ చిత్రం సాంకేతిక కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. 2.0 గ్రాఫిక్ అవుట్ పుట్ నచ్చకనే సినిమాను వాయిదా వేశారనే మాట వినిపించింది. అయితే సినిమాను అత్యంత టెక్నికల్ విలువలతో సినిమాను భారీగా తెరకెక్కించారని సంగీత దర్శకుడు ఆ మధ్య వెల్లడించారు. అయితే తాజాగా వీఎఫెక్స్ కోసం శంకర్ ఖర్చు చేసిన మొత్తాన్ని అక్షయ్ కుమార్ వెల్లడించడం మీడియాలో వైరల్గా మారింది.
అక్షయ్ కుమార్ ఏం చెప్పారంటే
తాజాగా అక్షయ్ కుమార్ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రోబో2.0 చిత్రంలో గ్రాఫిక్స్ పనుల కోసం దర్శకుడు శంకర్ భారీగా ఖర్చు చేశారు. సుమారు 75 మిలియన్ డాలర్లను కేవలం వీఎఫ్ఎక్స్ కోసం వినియోగించారు. అంటే రూపాయల్లో చూసుకొంటే ఆ మొత్తం సుమారు రూ.544 కోట్లు అని అక్షయ్ పేర్కొన్నారు. ఈ మొత్తంలో ఖర్చు చేయడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
సెప్టెంబర్ 13న టీజర్
అత్యున్నత సాంకేతికతతో రూపొందిన రోబో2.0 టీజర్ను సెప్టెంబర్ 13న పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. దేశవ్యాప్తంగా 3డీ వెర్షన్ టీజర్ను 3డీ థియేటర్లలో రిలీజ్ చేస్తాం. విదేశాల్లో కొన్ని థియేటర్లను ఎంపిక చేసే పనిలో ఉన్నాం. 2డీ వెర్షన్ టీజర్ను య్యూట్యూబ్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
3డీ టెక్నాలజీతో మొదటి చిత్రం
దేశంలోనే తొలిసారి పూర్తిగా 3డీ టెక్నాలజీ కెమెరాతో షూట్ చేసిన తొలిచిత్రంగా 2.0 ఓ ఘనతను సాధించింది. సినీ ప్రేక్షకులకు, అభిమానులకు 3డీ థియేటర్లలో కొత్త అనుభూతికి లోనవుతారు అని లైకా ప్రొడక్షన్ వెల్లడించింది. త్వరలోనే 3డీ టీజర్ ప్రదర్శించే థియేటర్ల జాబితాను వెల్లడిస్తామని తెలిపింది.
నవంబర్ 29న రిలీజ్
సెన్సేషనల్ డైరెక్టర్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 29న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.